News August 2, 2024
BREAKING.. కామారెడ్డి: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలోని అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామ శివారులో శుక్రవారం ఉదయం 44 నంబర్ జాతీయ రహదారిపై రోడ్డుప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న యువకుడిని గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. స్థానికులు సదాశివనగర్ పోలీసులకు సమాచారం అందించారు.
Similar News
News December 30, 2025
BIG BREAKING: నిజామాబాద్: ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు!

TGలో మున్సిపల్ ఎన్నికల సందడి అధికారికంగా మొదలైంది. నిజామాబాద్ కార్పొరేషన్, ఆర్మూర్, భీమ్గల్, బోధన్ మున్సిపాలిటీల కమిషనర్లతో ఎన్నికల కమిషనర్ గిరిధర్ సుందర్ బాబు VC నిర్వహించారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికలు ఫిబ్రవరిలో జరగనున్నాయి. ఓటర్ల జాబితాలో తప్పులు లేకుండా చూడాలని, జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ల లెక్క తేల్చాలని ఆదేశించారు. రిజర్వేషన్ల గెజిట్ వెలువడగానే అధికారిక నోటిఫికేషన్ రానుంది.
SHARE IT
News December 30, 2025
BREAKING: నిజామాబాద్ కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి బదిలీ

నిజామాబాద్ కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డిని బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ కృష్ణారావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయనను GHMC అడిషనల్ కమిషనర్ (మల్కాజ్గిరి, ఎల్బీనగర్, ఉప్పల్ జోన్స్)గా నియమించారు. ఇక నిజామాబాద్ కలెక్టర్గా 2017 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి ప్రస్తుత నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి రానున్నారు.
News December 30, 2025
ఆర్మూర్: మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం కావాలి: కలెక్టర్

మున్సిపల్ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేలా అన్ని విధాలుగా సన్నద్ధం కావాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయాన్ని కలెక్టర్ మంగళవారం పరిశీలించారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణ సన్నద్ధతపై కమిషనర్ ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు. జనవరి 10వ తేదీన తుది ఓటరు జాబితా వెలువరించాలని సూచించారు. ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ శైలజ తదితరులు పాల్గొన్నారు.


