News March 31, 2025

BREAKING: కిష్టాపురంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ

image

సూర్యాపేట జిల్లా చింతలపాలెం కిష్టాపురంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి సభకు కార్యాకర్తలను తరలించే విషయంలో ఇద్దరి మధ్యా ఘర్షణ తలెత్తినట్లు స్థానికులు తెలిపారు. ఇరువర్గాల మధ్య జరిగిన ఈ ఘర్షణలో పలు బైకులు, ఇళ్లలోని ఫర్నిచర్ ధ్వంసమైయ్యాయి. ఐదుగురు గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించారు. దీంతో గ్రామంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.

Similar News

News January 7, 2026

JNTU: వాయిదా పడిన బీ ఫార్మసీ పరీక్షలకు తేదీలు ఇవే!

image

JNTUకి సంబంధించి బీ ఫార్మసీ మొదటి సంవత్సరం సెకండ్ సెమిస్టర్‌తో పాటు, ఫస్ట్ సెమ్ సప్లిమెంటరీ పరీక్షలను ఈ నెల 27, 29న నిర్వహించనున్నట్లు ఎగ్జామినేషన్ డైరెక్టర్ వెల్లడించారు. నవంబర్ 4, 6వ తేదీన జరగవలసిన పరీక్షలు వాయిదా వేసిన నేపథ్యంలో నూతన తేదీలను ప్రకటించారు. దీనికి అనుగుణంగా అన్ని కళాశాలల ప్రిన్సిపల్స్ ఏర్పాటు చేసుకోవాలని అధికారులు సూచించారు.

News January 7, 2026

చిత్తూరు, తిరుపతి జిల్లాలో 600 ఉద్యోగాలు..!

image

SIPB సమావేశంలో తిరుపతి, చిత్తూరు జిల్లాలకు కీలక పెట్టుబడి ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. తిరుపతిలో ఎథీరియల్ ఎక్స్‌ప్లోరేషన్ గిల్డ్ రూ.578 కోట్లు, నవ ఫుడ్ సెంటర్ రూ.44.42 కోట్ల పెట్టుబడితో పరిశ్రమ స్థాపించేందుకు గ్రీన్ సిగ్నల్ దక్కింది. మరోవైపు చిత్తూరు జిల్లాలో పయనీర్ క్లీన్ అంప్స్ సంస్థ రూ.159 కోట్ల పెట్టుబడితో యూనిట్ ఏర్పాటు చేయనుండగా.. దీనివల్ల సుమారు 600 మందికి ఉపాధి అవకాశాలు కలగనున్నాయి.

News January 7, 2026

HYD: ఫతేమైదాన్ వద్ద ఈ గుట్ట గురించి తెలుసా?

image

నగరం అపూర్వ కట్టడాలు, సంపదకు నెలవు. ఇక్కడి కట్టడాలపై చరిత్రకారులు రాసిన పుస్తకాలు అనేకం. పెద్దగా ప్యాచుర్యంలేని ఫతేమైదాన్ సమీపంలో ‘నౌబత్ పహాడ్’ గురించి తెలుసా? ఈ పేరు వెనుక ఆసక్తికరమైన చరిత్ర ఉంది. ‘నౌబత్’ అంటే డోలు, ‘పహాడ్’ అంటే గుట్ట. ప్రజలకు ఫర్మానాలు వినిపించడానికి ఈ కొండపైనే నగారాలు మోగించేవారు. డోలు కొడుతూ ఆజ్ఞలను వినిపించేవారు. అలా ఈ ప్రాంతానికి నౌబత్ పహాడ్ అనే పేరు వచ్చింది.