News August 19, 2024

BREAKING: కైలాసపట్నం అనాథాశ్రమం సీజ్

image

కోటవురట్న మండలం కైలాసపట్నంలో అనాథాశ్రమాన్ని అధికారులు సోమవారం సీజ్ చేశారు. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డిప్యూటీ తహశీల్దార్ జగదీశ్, ఏఎస్ఐ గంగరాజు, రెవెన్యూ సిబ్బంది సీజ్ చేశారు. అనాథాశ్రమం నిర్వాహకుడు ఎం.కిరణ్ కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. విషాహారం తిని ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన సంఘటనపై సమగ్ర విచారణ జరుగుతోందని అధికారులు పేర్కొన్నారు.

Similar News

News December 20, 2025

విశాఖ: ‘కాంగ్రెస్ అవినీతి విషవృక్షం’

image

కాంగ్రెస్ అవినీతి విషవృక్షాన్ని సముద్రంలో విసిరేసిన ఏపీ ప్రజలకు హ్యాట్సాఫ్ అని కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ అన్నారు. బీచ్ రోడ్‌లో మాజీ ప్రధాని వాజ్ పేయి విగ్రహావిష్కరణలో పాల్గొని మాట్లాడారు. వైజాగ్ వస్తే బీపీ, షుగర్ ఎగిరిపోతాయన్నారు. చంద్రబాబు లాంటి విజన్ ఉన్న నాయకుడు అని, బీజేపీ వైపు ప్రజలు చూస్తున్నారు అన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, MP, ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్నారు.

News December 20, 2025

మధురవాడలో తెల్లవారుజామున యాక్సిడెంట్.. వ్యక్తి మృతి

image

మధురవాడలో తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో భీమిలి మండలం పెద్దవీధికి చెందిన పూసర్ల లక్ష్మణరావు (79) అక్కడికక్కడే మృతి చెందాడు. లక్ష్మణరావు వల్లినగర్‌లోని బంధువుల ఇంటికి వచ్చారు. శనివారం తెల్లవారుజామున 5:30 గంటలకు జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కాలనీ జంక్షన్ సమీపంలో సర్వీస్ రోడ్డులో వెళుతుండగా వేగంగా వచ్చిన వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనపై పీఎంపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News December 20, 2025

విశాఖ సిటీ పోలీస్ వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభం

image

విశాఖపట్నం సిటీ పోలీస్ ఇప్పుడు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలకు చేరువయ్యింది. 95523 00009 నంబర్‌కు “Hi” అని మెసేజ్ పంపి ఈ-చలాన్ చెల్లింపులు, ఎఫ్‌.ఐ.ఆర్ డౌన్‌లోడ్, కేసు స్టేటస్ వంటి సేవలను మీ ఫోన్ నుండే పొందవచ్చు. పారదర్శకత, వేగవంతమైన సేవల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ విధానం ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని పోలీసులు తెలిపారు. తక్షణ సహాయం కోసం ఈ సేవలను వినియోగించుకోవాలని కోరారు.