News February 28, 2025

BREAKING: కొత్తగూడెం.. ఏసీబీకి చిక్కిన HM

image

కొత్తగూడెం టౌన్ కూలీ లైన్ హైస్కూల్లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో హెడ్ మాస్టర్ రవీందర్ రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ వై.రమేష్ తెలిపారు. కరాటే శిక్షణకు పాఠశాలకు రూ.30 వేలు మంజూరయ్యాయి. ఇన్‌స్ట్రక్చర్‌కు ఇవ్వాల్సిన రూ.30 వేలల్లో రూ.20 వేలు లంచం డిమాండ్ చేయగా, బాధితుడి ఫిర్యాదు మేరకు దాడులు నిర్వహించినట్లు డీఎస్పీ పేర్కొన్నారు.

Similar News

News October 13, 2025

అనంతగిరి: కందిరీగల దాడిలో మహిళ మృతి

image

కందిరీగలు దాడిలో ఓ మహిళ తీవ్రంగా గాయపడి మరణించింది. కుటుంబీకుల వివరాల మేరకు..అనంతగిరి(M) కరయిగూడ గ్రామానికీ చెందిన శాంతి (20) ఆదివారం సాయంత్రం గ్రామ సమీపం కొండవద్ద పశువులను కాసేందుకు వెళ్లింది. ఒక్కసారిగా గుంపులగా కందిరీగలు ఆమె దాడి చేశాయి. స్థానికులు హుటాహుటిన కుటుంబ సభ్యులు అరకు ఏరియా ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బాధితురాలు నేడు మృతి చెందింది.

News October 13, 2025

ధర్నాలు, ర్యాలీలకు అనుమతి తప్పనిసరి: DSP

image

జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా నవంబర్ 11 వరకు సెక్షన్ 30 పోలీసు చట్టం అమలులో ఉందని ఇన్‌‌ఛార్జ్ డీఎస్పీ ఆర్.గోవిందరావు తెలిపారు. ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, ర్యాలీలు, సమావేశాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టరాదని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. ప్రజలు శాంతియుతంగా వ్యవహరించి, పోలీసు అనుమతులతోనే కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.

News October 13, 2025

జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్‌గా బాధ్యతల స్వీకరణ

image

విజయనగరంలోని జవహర్ లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ నూతన వైస్ ఛాన్సలర్‌గా వి.వెంకట సుబ్బారావు తన కార్యాలయంలో సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన నెహ్రూ, మహాకవి గురజాడ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. విశ్వవిద్యాలయ సిబ్బంది వెంకట సుబ్బారావుకు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు.