News March 1, 2025

BREAKING: కొత్తగూడెం: మరో రైతు ఆత్మహత్యాయత్నం

image

పురుగు మందు తాగి మరో రైతు బలవన్మరణానికి యత్నించిన ఘటన కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాలు.. ముత్తాపురం గ్రామానికి చెందిన పూసం నారాయణ తన పత్తి చేను వద్ద పురుగు మందు తాగి ఇంటికి వచ్చాడు. నోటి నుంచి నురుగు రావడంతో గమనించిన కుటుంబ సభ్యులు అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. 

Similar News

News November 12, 2025

పాలమూరు అగ్రో డైరెక్టర్ రమేష్ రెడ్డి అరెస్ట్

image

పాలమూరు అగ్రో కాంప్లెక్స్ లిమిటెడ్ డైరెక్టర్ ఎస్.రమేష్ రెడ్డిని ఎస్ఎఫ్ఐఓ అధికారులు అరెస్టు చేశారు. ప్రమోటర్లకు తెలియకుండా నకిలీ పత్రాలతో సంస్థకు చెందిన రూ.300 కోట్ల విలువైన 100 ఎకరాల భూమిని విక్రయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. కోర్టు వారెంట్ జారీ చేయడంతో, ఆయన్ను అధికారులు జ్యుడిషియల్ రిమాండ్‌కు తరలించారు.

News November 12, 2025

NGKL: ‘దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచే విధంగా కృషి చేయాలి’

image

దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచేలా నాగర్ కర్నూల్ జిల్లా అధికారులు కృషి చేయాలని నోడల్ అధికారి నీతూ కుమారి ప్రసాద్ అన్నారు. పీఎం ధన్ ధాన్య కృషి యోజన అమలుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సూచించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ బాదావత్ సంతోష్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

News November 12, 2025

ఏలూరు: రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి

image

వివేకా ఎక్స్‌ప్రెస్ రైలు నుంచి ప్రమాదవశాత్తు జారిపడి సుదీప్ బోరో (30) మృతి చెందాడు. మాల్దా జిల్లాకు చెందిన ఇతను చెంగనూరు నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా ఏలూరు రైల్వే స్టేషన్ పరిధిలోకి రాగానే ఈ ఘటన చోటుచేసుకుంది. బుధవారం స్టేషన్ మాస్టర్ సమాచారంతో రైల్వే హెచ్‌సీ శ్రీనివాసరావు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.