News March 1, 2025
BREAKING: కొత్తగూడెం: మరో రైతు ఆత్మహత్యాయత్నం

పురుగు మందు తాగి మరో రైతు బలవన్మరణానికి యత్నించిన ఘటన కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాలు.. ముత్తాపురం గ్రామానికి చెందిన పూసం నారాయణ తన పత్తి చేను వద్ద పురుగు మందు తాగి ఇంటికి వచ్చాడు. నోటి నుంచి నురుగు రావడంతో గమనించిన కుటుంబ సభ్యులు అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Similar News
News March 3, 2025
చిగురుమామిడి: హైనా దాడిలో లేగదూడ మృతి

కొండాపూర్ గ్రామానికి చెందిన చీకుట్ల రాజు అనే రైతు లేగ దూడపై హైనా దాడి చేసింది. రోజులాగే తన వ్యవసాయ పొలం వద్ద లేగదూడను కట్టివేసి ఇంటికి వెళ్ళానని, తిరిగి వచ్చేసరికి లేగ దూడ చనిపోయియిందన్నాడు. హైనా చంపిన ఆనవాళ్లను గుర్తించామని, ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని రైతుకోరాడు. రైతులు తమ పశువుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని, కంచె ఏర్పాటు చేసుకోవాలని ఫారెస్ట్ అధికారి శేఖర్ రైతులకు తెలిపారు.
News March 3, 2025
HYD: GIS సర్వేతో రూ.25.60 కోట్ల అదనపు ఆదాయం..!

గ్రేటర్లో మొత్తం 25 లక్షల ఇళ్లు ఉండగా, అందులోని 47,323 ఇళ్ల జీఐఎస్ సర్వే ఇప్పటికే పూర్తయిందని అధికారులు తెలిపారు. అందులో పన్ను పరిధిలోలేని 7,098 (15%) ఇళ్లు, తక్కువ పన్ను చెల్లిస్తోన్న 10,539 నిర్మాణాల లెక్కతేలాయి. తద్వారా జీహెచ్ఎంసీకి రూ.25.60 కోట్ల అదనపు ఆదాయం సమకూరింది. గూగుల్ మ్యాప్ ఆధారంగా జీహెచ్ఎంసీ వెలుపల 8.5 లక్షల ఇళ్లు ఉన్నట్టు, క్షేత్రస్థాయికి వెళ్తే ఆసంఖ్య 12.75 లక్షలు ఉండొచ్చని అంచనా.
News March 3, 2025
రాజమండ్రి: హత్య కేసులో జీవిత ఖైదు

2021 సెప్టెంబర్లో రాజమండ్రిలోని సీటీఆర్ఐ సెంటర్ వద్ద జరిగిన హత్య కేసులో ఒక నేరస్థుడికి సోమవారం కోర్టు శిక్ష విధించింది. వాద ప్రతివాదనలు విన్న తర్వాత జడ్జి ఆర్.శ్రీలత ముద్దాయి యర్రా సాయికి జీవితకాలం ఖైదు అలాగే రూ. 20 వేల జరిమానా విధించింది. ఈ కేసు పురోగతిలో సహకరించిన పీపీ రాధాకృష్ణరాజు, త్రీ టౌన్ సీఐ అప్పారావు, ఏఎస్ఐ వెంకటేశ్వర్లులను, ఎస్పీ నర్సింహ కిషోర్ను కోర్టు అభినందించింది.