News March 1, 2025

BREAKING: కొత్తగూడెం: మరో రైతు ఆత్మహత్యాయత్నం

image

పురుగు మందు తాగి మరో రైతు బలవన్మరణానికి యత్నించిన ఘటన కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాలు.. ముత్తాపురం గ్రామానికి చెందిన పూసం నారాయణ తన పత్తి చేను వద్ద పురుగు మందు తాగి ఇంటికి వచ్చాడు. నోటి నుంచి నురుగు రావడంతో గమనించిన కుటుంబ సభ్యులు అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. 

Similar News

News December 23, 2025

ఢిల్లీ బాటలో ఒడిశా.. మరి మన దగ్గర!

image

పొల్యూషన్ సర్టిఫికెట్‌ ఉన్న వాహనాలకే పెట్రోల్/డీజిల్ విక్రయించాలని ఒడిశా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిబంధన JAN 1 నుంచి అమలు కానుండగా, ఢిల్లీలో ఇప్పటికే పాటిస్తున్నారు. దేశ రాజధాని మాదిరి అధ్వాన వాయు కాలుష్య పరిస్థితులు రాకూడదంటే తెలుగు రాష్ట్రాల్లోని నగరాల్లోనూ ఈ రూల్ తేవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. ముందుగానే మేల్కొంటే ప్రజల ఆరోగ్యాన్ని కాపాడినట్లు అవుతుందని సూచిస్తున్నారు.

News December 23, 2025

గద్వాల: రైలు ఎక్కుతూ ప్రమాదవశాత్తూ జారిపడి వ్యక్తి మృతి

image

రైలు ఎక్కబోయి ప్రమాదవశాత్తూ జారి కిందపడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన సోమవారం గద్వాలలో జరిగింది. వనపర్తి జిల్లాకు చెందిన చాకలి కొండన్న (49) కదులుతున్న రైలు ఎక్కే క్రమంలో పడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం 108 వాహనంలో గద్వాల ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారని రైల్వే కానిస్టేబుల్ అశోక్ తెలిపారు.

News December 23, 2025

భారత్‌‌లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్

image

<<18623563>>హాదీ<<>> మరణం తర్వాత నెలకొన్న పరిణామాలతో భారత్-బంగ్లా సంబంధాలు క్షీణిస్తున్నాయి. తాజాగా భారతీయులకు కాన్సులర్, వీసా సర్వీసులను నిలిపేస్తున్నట్లు ఢిల్లీలోని బంగ్లాదేశ్ హై కమిషన్ తెలిపింది. అనివార్య పరిస్థితుల్లో తీసుకున్న ఈ నిర్ణయం తదుపరి నోటీసులు వచ్చే వరకు కొనసాగుతుందని చెప్పింది. హాదీ మృతి అనంతరం నెలకొన్న ఆందోళనలతో చటోగ్రామ్‌లోని వీసా అప్లికేషన్ సెంటర్‌ను భారత్ సండే క్లోజ్ చేసిన విషయం తెలిసిందే.