News March 1, 2025
BREAKING: కొత్తగూడెం: మరో రైతు ఆత్మహత్యాయత్నం

పురుగు మందు తాగి మరో రైతు బలవన్మరణానికి యత్నించిన ఘటన కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాలు.. ముత్తాపురం గ్రామానికి చెందిన పూసం నారాయణ తన పత్తి చేను వద్ద పురుగు మందు తాగి ఇంటికి వచ్చాడు. నోటి నుంచి నురుగు రావడంతో గమనించిన కుటుంబ సభ్యులు అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 30, 2025
MHBD: ముగిసిన తొలి దశ నామినేషన్ స్వీకరణ

జిల్లా వ్యాప్తంగా తొలి దశ నామినేషన్ స్వీకరణ శనివారంతో ముగిసింది. తొలి దశ ఎన్నికలకు సంబంధించి ఆయా గ్రామ పంచాయతీ పరిధిలో 155 సర్పంచ్ స్థానాలకు 1239, వార్డ్ మెంబర్ స్థానాలకు 3,496 అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్లు అధికారులు ప్రకటించారు. కాగా, ఆదివారం నుంచి రెండో దశ పంచాయతీ ఎన్నికల నామినేషన్లు షెడ్యూల్ పరిధిలోని నిర్ణీత పంచాయతీలో అధికారులు స్వీకరిస్తారు.
News November 30, 2025
కృష్ణా: LLB పరీక్షా ఫలితాలు విడుదల

కృష్ణా విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలలకు సంబంధించి LLB-2, BA LLB-2, 6 సెమిస్టర్ ఫలితాలను విశ్వవిద్యాలయం అధికారులు విడుదల చేశారు. LLB-2లో 261 మంది పరీక్షలు రాయగా 77.78% ఉత్తీర్ణత సాధించారన్నారు. BA LLB-2 సెమిస్టర్లో 87.79%, BA LLB-6 సెమిస్టర్లో 94.12% ఉత్తీర్ణత సాధించారని పరీక్షల నియంత్రణాధికారి డా.పి.వి బ్రహ్మచారి తెలియజేశారు.
News November 30, 2025
బీజేపీ ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్గా మహిపాల్ రెడ్డి

బీజేపీ జిల్లాల వారీగా పార్టీ ఇన్ఛార్జుల పేర్లను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ రావు శనివారం ప్రకటించారు. ఇందులో భాగంగా బద్ధం మహిపాల్ రెడ్డి ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్గా నియమితులయ్యారు. ఖమ్మానికి చెందిన కొండపల్లి శ్రీధర్ రెడ్డిని వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్గా, సన్నె ఉదయ్ ప్రతాప్ను నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్గా నియమించినట్లు వెల్లడించారు. ఈ నియామకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని పార్టీ వర్గాలు తెలిపాయి.


