News March 1, 2025

BREAKING: కొత్తగూడెం: మరో రైతు ఆత్మహత్యాయత్నం

image

పురుగు మందు తాగి మరో రైతు బలవన్మరణానికి యత్నించిన ఘటన కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాలు.. ముత్తాపురం గ్రామానికి చెందిన పూసం నారాయణ తన పత్తి చేను వద్ద పురుగు మందు తాగి ఇంటికి వచ్చాడు. నోటి నుంచి నురుగు రావడంతో గమనించిన కుటుంబ సభ్యులు అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. 

Similar News

News November 18, 2025

ఆదిలాబాద్: మళ్లీ ఆశల చిగురింత

image

స్థానిక పోరుపై ఆశలు వదులుకున్న గ్రామాల్లో ఎన్నికల నిర్వహణపై రాష్ట్రం ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఉమ్మడి ADB జిల్లాలో సందడి మొదలైంది. ఇకేంముంది మళ్లీ చర్చలు మొదలయ్యాయి. రిజర్వేషన్లు అనుకూలంగా రాకపోవడంతో నిరాశ చెందిన ఆశావాహుల్లో ఆశలు చిగురించాయి. రిజర్వేషన్లు మారనున్న నేపథ్యంలో పోటీ చేయడానికి ఆశావహులు సిద్ధం అవుతున్నారు. ఉమ్మడి జిల్లాలో 1514 గ్రామ పంచాయతీలు, 581 MPTC, 69 ZPTC స్థానాలున్నాయి.

News November 18, 2025

ఆదిలాబాద్: మళ్లీ ఆశల చిగురింత

image

స్థానిక పోరుపై ఆశలు వదులుకున్న గ్రామాల్లో ఎన్నికల నిర్వహణపై రాష్ట్రం ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఉమ్మడి ADB జిల్లాలో సందడి మొదలైంది. ఇకేంముంది మళ్లీ చర్చలు మొదలయ్యాయి. రిజర్వేషన్లు అనుకూలంగా రాకపోవడంతో నిరాశ చెందిన ఆశావాహుల్లో ఆశలు చిగురించాయి. రిజర్వేషన్లు మారనున్న నేపథ్యంలో పోటీ చేయడానికి ఆశావహులు సిద్ధం అవుతున్నారు. ఉమ్మడి జిల్లాలో 1514 గ్రామ పంచాయతీలు, 581 MPTC, 69 ZPTC స్థానాలున్నాయి.

News November 18, 2025

కేరళ రూల్ మన దగ్గరా కావాలని డిమాండ్!

image

ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు కేరళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలొస్తున్నాయి. ఇక్కడి రెస్టారెంట్లలో వంట నూనెను మూడు సార్లు కంటే ఎక్కువ ఉపయోగిస్తే రూ.లక్ష వరకు జరిమానా విధించనున్నారు. నూనెను ఎక్కువసార్లు వేడి చేయడం వల్ల గుండె జబ్బులు వస్తాయి. తెలుగు రాష్ట్రాల్లోని చాలా రెస్టారెంట్లలోనూ ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించట్లేదని, అధికారులు కఠినంగా వ్యవహరించాలని పలువురు కోరుతున్నారు. మీకామెంట్?