News March 1, 2025

BREAKING: కొత్తగూడెం: మరో రైతు ఆత్మహత్యాయత్నం

image

పురుగు మందు తాగి మరో రైతు బలవన్మరణానికి యత్నించిన ఘటన కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాలు.. ముత్తాపురం గ్రామానికి చెందిన పూసం నారాయణ తన పత్తి చేను వద్ద పురుగు మందు తాగి ఇంటికి వచ్చాడు. నోటి నుంచి నురుగు రావడంతో గమనించిన కుటుంబ సభ్యులు అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. 

Similar News

News February 25, 2026

‘పాల’కూట విషం.. ‘జలం’ కలుషితం.. బతికేదెలా?

image

తెల్లనివన్నీ పాలు.. నల్లనివన్నీ నీళ్లు అనుకుంటే పొరపాటే. కల్తీరాయుళ్లు పాలనూ విషతుల్యం చేసేస్తూ ప్రజల ప్రాణాలను పీల్చేస్తున్నారు. అటు ప్రాణాధారమైన మంచి నీళ్లు డ్రైనేజీ వాటర్‌తో కలుషితమవుతున్నాయి. అయినా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. APలోని <<19230296>>రాజమండ్రి, శ్రీకాకుళం<<>> ఉదంతాలే ఇందుకు నిదర్శనం. ఈ ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కొరడా ఝుళిపించాల్సి ఉంది.

News February 25, 2026

పల్నాడులో విషాదం.. మహిళ అనుమానాస్పద మృతి

image

రాజుపాలెం మండలం ఉప్పలపాడు గ్రామంలో వెల్పుల మల్లేశ్వరి (45) మృతి చెందడంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. తీవ్ర గాయాలతో ఉన్న ఆమె మృతదేహం లభ్యం కావడంతో గ్రామస్థులు దిగ్భ్రాంతికి గురయ్యారు. మల్లేశ్వరి మరణం వెనుక కుటుంబ కలహాలు ఉన్నాయా లేదా ఎవరైనా దాడి చేశారా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

News February 25, 2026

వేరుశనగలో జింక్ లోపం లక్షణాలు – నివారణ

image

వేరుశనగలో పంట నాణ్యత, దిగుబడి పెరగడానికి జింక్ చాలా కీలకం. ఈ సూక్ష్మపోషకం తగ్గినప్పుడు మొక్కలో ఎదుగుదల ఉండదు. ఆకులు పసుపు రంగులోకి మారతాయి. ఈనెలకు ఇరువైపులా తుప్పురంగు మచ్చలు ఏర్పడతాయి. ఈ లక్షణాలు కనిపించగానే లీటరు నీటికి 2 గ్రాముల చొప్పున జింక్ సల్ఫేట్ ద్రావణాన్ని వారం వ్యవధిలో 2-3సార్లు పిచికారీ చేయాలి. ఎకరాకు 20 కిలోల చొప్పున జింక్ సల్ఫేట్‌ను 3 పంటలకొకసారి ఆఖరి దుక్కిలో వేసుకోవాలి.