News February 20, 2025

BREAKING: కొత్తగూడెం: లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికాడు! 

image

ఏసీబీ వలలో మరో అవినీతి అధికారి పట్టుబడ్డ ఘటన భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో గురువారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. మండల వ్యవసాయ శాఖ అధికారి సాయి శంతన్ కుమార్ రైతుకు పత్తి అమ్ముకునేందుకు కూపన్ ఇవ్వడానికి రూ.30 వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధిత రైతు ఏసీబీని ఆశ్రయించడంతో సాయి శాంతన్ కుమార్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ వై.రమేశ్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

Similar News

News November 23, 2025

తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో తెలంగాణ వంటల వారసత్వ వాక్

image

ప్రపంచ వారసత్వ వారోత్సవాల సందర్భంగా తెలంగాణ టూరిజం ‘తెలంగాణ వంటల వారసత్వ వాక్‌’ను చార్మినార్‌‌లో ప్రారంభించింది. వంటకాల రుచి, తయారీ పద్ధతులను ప్రోత్సహించడం దీని ముఖ్య ఉద్దేశ్యం. తెలంగాణ వంటకాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావడానికి, ఫుడ్ స్టార్టప్‌లకు ప్రోత్సాహం అందించడానికి ఈ వేదిక ఉపయోగపడుతుంది. వంటకాల రుచిని ఆస్వాదిస్తూ, వాటి వెనుక ఉన్న కథలను, చరిత్రను తెలుసుకునే అవకాశం లభిస్తుంది.

News November 23, 2025

తల్లి పాలల్లో యురేనియం ఆనవాళ్లు.. కానీ!

image

ఈ ప్రపంచంలో తల్లి పాలను మించిన పోషకాహారం లేదు. కానీ మారిన వాతావరణ పరిస్థితులతో వాటిలోనూ రసాయనాలు చేరుతున్నాయి. తాజాగా బిహార్ తల్లుల పాలల్లో యురేనియం(5ppb-పార్ట్స్ పర్ బిలియన్) ఆనవాళ్లు గుర్తించినట్లు NDMA సైంటిస్ట్ దినేశ్ వెల్లడించారు. అయితే WHO అనుమతించిన స్థాయికంటే తక్కువగానే ఉన్నాయని, దీనివల్ల ప్రస్తుతానికి ప్రమాదం లేదని చెప్పారు. నీటిలో మాత్రం 6 రెట్లు ఎక్కువగా యురేనియం ఆనవాళ్లు ఉన్నాయన్నారు.

News November 23, 2025

ప్రకాశం జిల్లా ఇన్‌ఛార్జ్ ఎస్పీగా బాపట్ల ఎస్పీ

image

బాపట్ల ఎస్పీ బి. ఉమామహేశ్వర్ ప్రకాశం జిల్లా ఇన్‌ఛార్జ్ ఎస్పీగా నియమించబడ్డారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా ఎస్పీగా ఉన్న హర్ష వర్ధన్ రాజు డిసెంబర్ 2 వరకు సెలవుల్లో ఉన్నారు. ఆ సమయంలో బాపట్ల ఎస్పీ బి. ఉమామహేశ్వర్ ప్రకాశం జిల్లాకు ఇన్‌‌ఛార్జ్ ఎస్పీగా బాధ్యతలు నిర్వహించనున్నారు. ఈ మేరకు బాపట్ల ఎస్పీ కార్యాలయ ప్రతినిధులు ఆదివారం ఈ విషయాన్ని ఒక ప్రకటన ద్వారా తెలిపారు.