News January 23, 2025
BREAKING: ఖమ్మం జిల్లాలో తీవ్ర విషాదం

ఖమ్మం జిల్లా మధిర పరిధిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. మధిర పరిధి నిదానపురం గ్రామంలో తల్లి ఇద్దరు కూతుళ్లను చంపి తాను ఆత్మహత్య చేసుకుంది. ఓ చోరీ కేసులో తన భర్త షేక్ బాజీని ఖమ్మం పోలీసులు అదుపులోకి తీసుకుని వెళ్లారని, అవమానం భరించలేక భార్య ప్రేజా(35).. కుమార్తెలు మెహక్(6), మెనురూల్(7)ను చంపి తాను ఉరేసుకుని చనిపోయింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 17, 2025
PDPL: చేపపిల్లల సరఫరా టెండర్లకు దరఖాస్తుల ఆహ్వానం

పెద్దపల్లి జిల్లా మత్స్యశాఖ 2025- 26 చేపపిల్లల పంపిణీ కోసం సరఫరాదారుల నుంచి ఆన్లైన్ టెండర్లను ఆహ్వానించిందని జిల్లా మత్స్యశాఖ అధికారి పి.నరేష్ కుమార్ నాయుడు సోమవారం తెలిపారు. రేపటి నుంచి టెండర్ పత్రాలు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నవంబర్ 19న ఫ్రీ బిడ్ మీటింగ్ అదనపు కలెక్టర్ ఛాంబర్లో జరగనుంది. నవంబర్ 21న ఉదయం 10:30 నుంచి నవంబర్ 25 మధ్యాహ్నం 3 గంటల వరకు బిడ్లు దాఖలు చేయవచ్చని అధికారి సూచించారు.
News November 17, 2025
PDPL: చేపపిల్లల సరఫరా టెండర్లకు దరఖాస్తుల ఆహ్వానం

పెద్దపల్లి జిల్లా మత్స్యశాఖ 2025- 26 చేపపిల్లల పంపిణీ కోసం సరఫరాదారుల నుంచి ఆన్లైన్ టెండర్లను ఆహ్వానించిందని జిల్లా మత్స్యశాఖ అధికారి పి.నరేష్ కుమార్ నాయుడు సోమవారం తెలిపారు. రేపటి నుంచి టెండర్ పత్రాలు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నవంబర్ 19న ఫ్రీ బిడ్ మీటింగ్ అదనపు కలెక్టర్ ఛాంబర్లో జరగనుంది. నవంబర్ 21న ఉదయం 10:30 నుంచి నవంబర్ 25 మధ్యాహ్నం 3 గంటల వరకు బిడ్లు దాఖలు చేయవచ్చని అధికారి సూచించారు.
News November 17, 2025
VZM: ‘సివిల్ సర్వీసెస్లో ఉచిత శిక్షణ’

ఏపీ వెనుకబడిన సంక్షేమ, సాధికారత శాఖ ఆధ్వర్యంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగ అభ్యర్థులకు సివిల్ సర్వీసెస్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఆ శాఖాధికారిణి జె.జ్యోతిశ్రీ తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈనెల 25లోపు ధరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అనంతరం డిసెంబర్ 5న అభ్యర్థులకు స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తామన్నారు. పూర్తి వివరాలకు 96035 57333, 98668 86844 నంబర్లను సంప్రదించాలన్నారు.


