News January 23, 2025

BREAKING: ఖమ్మం జిల్లాలో తీవ్ర విషాదం 

image

ఖమ్మం జిల్లా మధిర పరిధిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. మధిర పరిధి నిదానపురం గ్రామంలో తల్లి ఇద్దరు కూతుళ్లను చంపి తాను ఆత్మహత్య చేసుకుంది. ఓ చోరీ కేసులో తన భర్త షేక్ బాజీని ఖమ్మం పోలీసులు అదుపులోకి తీసుకుని వెళ్లారని, అవమానం భరించలేక భార్య ప్రేజా(35).. కుమార్తెలు మెహక్(6), మెనురూల్(7)ను చంపి తాను ఉరేసుకుని చనిపోయింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.  

Similar News

News November 20, 2025

HYD: సందీప్ సూసైడ్‌కు కారణమైన నిందితుల ARREST

image

సందీప్ చావుకి కారణమైన బాలరాజు, హరీశ్‌ను ఈరోజు జవహర్‌నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు.. కాప్రా(M) బాలాజీనగర్‌కు చెందిన బాలరాజు, సందీప్ స్నేహితులు. ఇద్దరు దొంగతనాలు చేస్తూ చెడు అలవాట్లకు బానిసయ్యారు. వీరిలో సందీప్ తప్పు తెలుసుకుని చెడు స్నేహం మానేశాడు. కోపంతో బాలరాజు మరో మిత్రుడు హరీశ్‌తో కలిసి సందీప్‌ను కొట్టగా మనస్తాపం చెందిన అతడు గత రాత్రి బ్లేడ్‌తో గొంతు కోసుకుని చనిపోయాడు.

News November 20, 2025

HYD: సందీప్ సూసైడ్‌కు కారణమైన నిందితుల ARREST

image

సందీప్ చావుకి కారణమైన బాలరాజు, హరీశ్‌ను ఈరోజు జవహర్‌నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు.. కాప్రా(M) బాలాజీనగర్‌కు చెందిన బాలరాజు, సందీప్ స్నేహితులు. ఇద్దరు దొంగతనాలు చేస్తూ చెడు అలవాట్లకు బానిసయ్యారు. వీరిలో సందీప్ తప్పు తెలుసుకుని చెడు స్నేహం మానేశాడు. కోపంతో బాలరాజు మరో మిత్రుడు హరీశ్‌తో కలిసి సందీప్‌ను కొట్టగా మనస్తాపం చెందిన అతడు గత రాత్రి బ్లేడ్‌తో గొంతు కోసుకుని చనిపోయాడు.

News November 20, 2025

రైతులకు అండగా ఉండటం మా బాధ్యత: లోకేశ్

image

AP: సాగు తీరు మారాలి.. అన్నదాత బతుకు బాగుపడాలన్నదే తమ సంకల్పమని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. “ఇవాళ 46.85 లక్షల మంది రైతులకు ‘అన్నదాత సుఖీభవ-PM కిసాన్’ కింద 2విడతల్లో కలిపి రూ.14 వేలు చొప్పున జమ చేశాం. అలాగే CM చంద్రబాబు వ్యవసాయాభివృద్ధికి పంచసూత్రాలు ప్రకటించారు. నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటల సాగు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వ సాయం వంటి మార్గదర్శకాలు సూచించారు” అని ట్వీట్ చేశారు.