News February 21, 2025
BREAKING: ఖమ్మం: శ్రీ చైతన్య కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్య

ఖమ్మంలోని ఇల్లందు క్రాస్ రోడ్లో గల శ్రీచైతన్య జూనియర్ కాలేజీ క్యాంపస్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని డేగల యోగనందిని (17) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని స్థానికులు తెలిపారు. ఉదయం స్టడీ అవర్కు హాజరైన ఆమె హాస్టల్కు వెళ్లి ఆత్మహత్యకు పాల్పడిందని చెప్పారు. మృతురాలు ఏపీ అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక వాసి సత్యరాజ్ కుమార్తెగా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు దర్యాప్తు చేపట్టామన్నారు.
Similar News
News December 11, 2025
KMM: ‘అయ్యా బాబోయ్.. 10 రోజుల్లో రూ.125 కోట్ల మద్యం తాగేశారు’

ఖమ్మం, భద్రాద్రి జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల హడావిడి కొనసాగుతుంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు మద్యం, నగదును ప్రధాన హస్తంగా మలుచుకున్నారు. ఈ నేపథ్యంలో భద్రాద్రి, ఖమ్మం జిల్లాలో గడిచిన పది రోజుల్లో రూ.125 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు. కాగా ఈ నెల 17 వరకు పంచాయతీ ఎన్నికలు ఉండడంతో మద్యం అమ్మకాలు మరింతగా పెరిగా అవకాశం ఉంది.
News December 11, 2025
ఖమ్మం గ్రామాల్లో ఉత్కంఠ.. ఓటేసేందుకు రెడీనా?

ఖమ్మం జిల్లాలో తొలివిడతలో 7 మండలాలకు పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. బోనకల్(22), చింతకాని(26), కొణిజర్ల(27), మధిర(27), రఘునాథపాలెం(37), వైరా(22), ఎర్రుపాలెం(31) మండలాల్లో జరగనున్నాయి. పోలింగ్ ఉ. 7 నుంచి మ. 1గంట వరకు జరగనుండగా.. మ. 2గంటల నుంచి నుండి ఫలితాలు వెల్లడికానున్నాయి. మరి ఓటేసేందుకు రెడీనా?
News December 11, 2025
ఖమ్మం: పంచాయతీ ఎన్నికల పర్యవేక్షణకు పటిష్ఠ ఏర్పాట్లు: కలెక్టర్

ఖమ్మం జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల పర్యవేక్షణ కోసం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక వెబ్ కాస్టింగ్ మానిటరింగ్ సెల్ను కలెక్టర్ అనుదీప్ పరిశీలించారు. 7మండలాల్లోని 360క్రిటికల్ పోలింగ్ కేంద్రాలకు సీసీ కెమెరాలు, వెబ్ క్యాస్టింగ్ ఏర్పాటు చేశారు. క్రిటికల్ కేంద్రాల పర్యవేక్షణకు కలెక్టరేట్లో 7స్క్రీన్లు అమర్చినట్లు తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు.


