News April 2, 2025
BREAKING: గద్వాలలో విషాదం

కరెంట్ షాక్తో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన గద్వాల మండల పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. వెంకటంపల్లి గ్రామానికి చెందిన యువకుడు నవీన్(30) వీరాపురం సమీపంలో ఉన్న ఓ ప్రైవేట్ స్కూల్లో సెంట్రింగ్ పని చేస్తుండగా ప్రమాదవశాత్తు ఐరన్ విద్యుత్ వైర్లపై పడి కరెంట్ షాక్కు గురై మృతిచెందాడు. ఘటనా స్థలానికి పోలీసులు వచ్చినట్లు సమాచారం. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News September 15, 2025
CSIRలో ఉద్యోగాలు.. అప్లై చేసుకోండి

<
News September 15, 2025
తిరుపతిలో డ్రగ్స్ నిర్మూలనకు కృషి చేస్తా: SP

శాంతి భద్రతల పరిరక్షణే పోలీసుల ధ్యేయమని తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఎస్పీ కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. లా అండ్ ఆర్డర్ పటిష్టంగా ఉంచడమే పోలీసుల ధ్యేయమని, 24 గంటల పాటు అందుబాటులో ఉండి ప్రజలకు సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ‘డ్రగ్స్ ఫ్రీ తిరుపతి’ తన లక్ష్యం అన్నారు.
News September 15, 2025
ఉమ్మడి గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు.?

రాబోయే 4 రోజులు ఉమ్మడి గుంటూరు జిల్లాలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఉరుములతో కూడిన వర్షాలు పడేటప్పుడు చెట్ల కింద ఉండవద్దని హెచ్చరించారు. ఆదివారం గుంటూరులో 81 మి.మీ. వర్షపాతం నమోదైంది. సోమవారం గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు.