News April 3, 2025

BREAKING.. గద్వాల: బాలుడి తల, మొండెం వేరైంది!

image

మల్దకల్ మండలంలో గురువారం తీవ్ర విషాదం నెలకొంది. మండలంలోని నీలిపల్లిలో తల్లిదండ్రుల వెంట ఎనిమిదేళ్ల జీవన్ వరి పొలం దగ్గరికి వెళ్లాడు. వారు వరికోత యంత్రంతో పొలంలో పనులు చేయిస్తున్నారు. బాలుడు ఆడుకుంటూ మిషన్ దగ్గరికి వెళ్లడంతో.. అది ఆ బాలుడి మీది నుంచి వెళ్లింది. దీంతో బాలుడి తల, శరీరం వేరై అక్కడికక్కడే మృతి చెందాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News October 20, 2025

దీపావళి.. వైద్యులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి

image

దీపావళి పండుగ సందర్భంగా వైద్యులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. కంటి గాయాలు, కాలిన గాయాలతో ఎవరైనా ఆసుపత్రికి వస్తే వెంటనే చికిత్స అందించాలని చెప్పారు. ఆసుపత్రిలో అవసరమైన మెడిసిన్ ఎక్కువ మెంట్ అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. బాణాసంచా కాల్చే సమయంలో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.

News October 20, 2025

ఖేడ్‌లో 21న ఉమ్మడి జిల్లా రగ్బీ ఎంపికలు

image

ఉమ్మడి మెదక్ జిల్లా బాలబాలికల అండర్-19 రగ్బీ ఎంపికలు ఈనెల 21న నారాయణఖేడ్‌లోని తహశీల్దార్ మైదానంలో నిర్వహిస్తున్నట్లు సంగారెడ్డి జిల్లా ఇంటర్ అధికారి గోవిందారం తెలిపారు. ఇంటర్ చదువుతున్న విద్యార్థులు మాత్రమే అర్హులని చెప్పారు. ఆసక్తిగల వారు బోనాఫైడ్, పదవ తరగతి మెమో, జనన ధ్రువీకరణ పత్రంతో ఉదయం 9 గంటలకు హాజరుకావాలని సూచించారు.

News October 20, 2025

మంత్రి కోమటిరెడ్డి దీపావళి విషెస్

image

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దీపావళిని ‘జ్ఞాన వెలుగులు నింపే పండుగ’గా ఆయన అభివర్ణించారు. దీపాలు చీకటిని తరిమినట్టుగానే, ఈ పండుగ ప్రజల జీవితాల్లోని అజ్ఞానమనే చీకటిని తొలగించి, నూతన వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. లక్ష్మీదేవి కృపాకటాక్షాలు ప్రతి ఇంట్లో సకల శుభాలు కలిగించాలని కోరారు.