News April 14, 2025
BREAKING: గద్వాల: యాక్సిడెంట్.. ఇద్దరు మృతి

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మరణించిన ఘటన గద్వాల జిల్లా మానవపాడు మండలం జల్లాపురం గ్రామ శివారులోని ఆర్టీఏ చెక్పోస్ట్ వద్ద సోమవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. నాందేడ్ నుంచి పసుపు లోడ్తో కేరళకు వెళ్తున్న లారీ హైవే పక్కన ఆగింది. ఈ సమయంలో షాద్నగర్ నుంచి ఆళ్లగడ్డ వెళ్తున్న లారీ అతివేగంగా వచ్చి ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ప్రమాదంలో లారీ డ్రైవర్ షేక్ హుస్సేన్, క్లీనర్ వీరయ్య మృతిచెందారు.
Similar News
News September 17, 2025
నిర్మల్: ‘రైతులు అధైర్య పడొద్దు.. ఆదుకుంటా’

రైతులు ఎవరూ అధైర్య పడొద్దని ప్రభుత్వం తరఫున అన్ని విధాలా ఆదుకుంటామని తెలంగాణ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ సిరిసిల్ల రాజయ్య అన్నారు. సోన్ మండలం కడ్తాల్ గ్రామంలో భారీ వర్షాలకు తెగిపోయిన పెద్ద చెరువు కట్టను బుధవారం జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, డీసీసీ అధ్యక్షుడు శ్రీహరి రావుతో కలిసి ఆయన పరిశీలించారు. రైతులతో మాట్లాడి జరిగిన పంట నష్టం వివరాలు అడిగి తెలుసుకున్నారు.
News September 17, 2025
ఆరోగ్యశ్రీ సేవలను కొనసాగించాలి: మంత్రి

TG: ఆరోగ్యశ్రీ సేవలను యథాతథంగా కొనసాగించాలని ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలను మంత్రి రాజనర్సింహ కోరారు. గత 9 ఏళ్లలో చేయని సమ్మె ఇప్పుడెందుకు చేయాల్సి వస్తోందని ప్రశ్నించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని, ప్రజలకు ఆరోగ్యశ్రీ సేవల్లో అంతరాయం ఉండదని స్పష్టం చేశారు. బకాయిలను చెల్లించాలనే డిమాండ్తో నెట్వర్క్ ఆస్పత్రులు ఇవాళ్టి నుంచి సేవలను <<17734028>>నిలిపివేసిన<<>> సంగతి తెలిసిందే.
News September 17, 2025
ఎన్టీఆర్: అమరావతి అసైన్డ్ రైతులకు ఊరట

రాజధాని అమరావతికి భూములిచ్చిన అసైన్డ్ రైతులకు ప్రభుత్వం ఊరటనిచ్చింది. CRDA వీరికిచ్చే రిటర్నబుల్ ఫ్లాట్ల ఓనర్షిప్ సర్టిఫికెట్లో “అసైన్డ్” అనే పదం తొలగించి పట్టా భూమి అనే పేర్కొంటామని బుధవారం ఉత్తర్వులిచ్చింది. ఇటీవల చంద్రబాబును కలసిన రైతులు అసైన్డ్ అని ఉన్న కారణంగా తమ ఫ్లాట్లకు తక్కువ ధర వస్తోందని చెప్పగా..సీఎం చంద్రబాబు ఓనర్షిప్ సర్టిఫికెట్లో మార్పులు చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు.