News April 14, 2025
BREAKING: గద్వాల: యాక్సిడెంట్.. ఇద్దరు మృతి

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మరణించిన ఘటన గద్వాల జిల్లా మానవపాడు మండలం జల్లాపురం గ్రామ శివారులోని ఆర్టీఏ చెక్పోస్ట్ వద్ద సోమవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. నాందేడ్ నుంచి పసుపు లోడ్తో కేరళకు వెళ్తున్న లారీ హైవే పక్కన ఆగింది. ఈ సమయంలో షాద్నగర్ నుంచి ఆళ్లగడ్డ వెళ్తున్న లారీ అతివేగంగా వచ్చి ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ప్రమాదంలో లారీ డ్రైవర్ షేక్ హుస్సేన్, క్లీనర్ వీరయ్య మృతిచెందారు.
Similar News
News December 19, 2025
రొనాల్డో బాడీ అదుర్స్.. VIRAL

పోర్చుగల్ ఫుట్బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫొటో ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. 40 ఏళ్ల వయసులో 8 ప్యాక్స్తో పాటు ఫుల్ ఫిట్గా ఉన్నారని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. డైట్, ఫిట్నెస్ పట్ల రొనాల్డో డెడికేషన్ అద్భుతం అని కొనియాడుతున్నారు. అతడి బాడీ ఫ్యాట్ పర్సెంటేజీ కేవలం 7% మాత్రమే ఉంటుంది.
News December 19, 2025
కాకినాడ జిల్లాలో పోలీసులు డ్రోన్స్తో నిఘా

కాకినాడలోని ప్రధాన ప్రాంతాలు, ఉప్పాడ బస్టాండ్, సామర్లకోట, పెద్దాపురం, పిఠాపురం, కాకినాడ రూరల్ తదితర ప్రాంతాలలో శుక్రవారం పోలీసులు డ్రోన్స్తో నిఘా పెట్టారు. బహిరంగ మద్యపాన నిషేధం, ఈవ్ టీజింగ్, చైన్ స్నాచింగ్ వంటివి జరగకుండా ఈ నిఘా ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ కార్యాలయం వెల్లడించింది. అనుమానితులను అదుపులో తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు.
News December 19, 2025
సూర్యాపేట: ఆ బిల్లును వెంటనే ఉపసంహరించాలి: జూలకంటి

సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగిన సీపీఎం జిల్లా కమిటీ సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి మాట్లాడారు. ఉపాధి హామీ చట్టాన్ని నీరుగార్చే బిల్లును కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ బిల్లుతో కూలీలు, పేదలకు తీవ్ర నష్టం జరుగుతుందని పేర్కొంటూ ఈనెల 20 నుంచి 23 వరకు జిల్లా వ్యాప్తంగా బిల్లుపత్రాలను దహనం చేయాలని పిలుపునిచ్చారు.


