News February 17, 2025

BREAKING: గోదావరిఖని: నదిలో దూకింది..!

image

పెద్దపల్లి జిల్లా ముస్త్యాల గ్రామానికి చెందిన లక్ష్మీ అనే మహిళ కొద్దిసేపటి క్రితం గోదావరిఖని శివారులోని గోదావరి బ్రిడ్జిపై నుంచి నదిలోకి దూకిందని స్థానికులు తెలిపారు. నదిలో నీరు లేని ప్రదేశంలో పడటంతో ఆమెకు బలమైన గాయాలయ్యాయని చెప్పారు. స్థానికులు గమనించి ఆమెను స్థానిక ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. అయితే ఆమె ఎందుకు ఆత్మహత్యకు యత్నించిందో కారణాలు తెలియాల్సి ఉంది.

Similar News

News December 20, 2025

GHMC వార్డుల విభజన.. బయటికొచ్చిన మ్యాపులు (EXCLUSIVE)

image

గ్రేటర్ హైదరాబాద్ వార్డుల పునర్విభజనపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. హైకోర్టు ఆదేశాలతో లంగర్ హౌస్ (వార్డు 134), షా అలీ బండ (వార్డు 104)లకు సంబంధించిన సరిహద్దు మ్యాపులను అధికారులు వెల్లడించారు. తాజా నివేదిక ప్రకారం లంగర్ హౌస్‌లో 50,484 మంది, షా అలీ బండలో 32,761 మంది జనాభా ఉన్నట్లు తేలింది. బాపు ఘాట్, మూసీ నది, గోల్కొండ కోట గోడల వెంట వార్డుల విభజన తీరు ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమైంది.

News December 20, 2025

కాకినాడ సుబ్బయ్య హోటల్‌‌లో అధికారుల తనిఖీలు

image

కాకినాడ సుబ్బయ్య హోటల్‌లో శనివారం వాణిజ్య పన్నుల శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఉదయం నుంచే హోటల్ పరిసరాలను తమ అధీనంలోకి తీసుకున్న అధికారులు రికార్డులను పరిశీలిస్తున్నారు. అధికారులు రాకముందే హోటల్ యజమానులు అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. సోదాల అనంతరం వాణిజ్య పన్నుల శాఖ అధికారులు అధికారిక ప్రకటన వెలువరించే అవకాశం ఉంది.

News December 20, 2025

పార్వతీపురం: ‘ప్లాస్టిక్ తయారీ యూనిట్లపై నిరంతర నిఘా ఉంచాలి’

image

ప్లాస్టిక్ తయారీ యూనిట్లపై పరిశ్రమల శాఖ నిరంతర నిఘా ఉంచాలని జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ కార్యాలయంలో అధికారులతో ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణపై ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మార్కెట్లు, దుకాణాలు, గ్రామీణ వారపు సంతల్లో ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ వినియోగం అధికంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.