News June 3, 2024

BREAKING: చిట్యాల వద్ద యాక్సిడెంట్

image

నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి వద్ద రోడ్డుప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని ప్రైవేటు బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, నలుగురికి గాయాలయ్యాయి. బస్సు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళుతోంది.

Similar News

News December 23, 2025

దరఖాస్తుల పెండింగ్‌పై నల్గొండ కలెక్టర్ సీరియస్

image

విద్యార్థుల ఉపకార వేతనాలకు ఆటంకం కలగకుండా కుల, ఆదాయ ధ్రువపత్రాలను తక్షణమే జారీ చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. మంగళవారం కనగల్ మండలంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టిన ఆమె ఎంపీడీవో, తహశీల్దార్ కార్యాలయాల్లో దరఖాస్తుల స్థితిగతులను సమీక్షించారు. సర్టిఫికేట్ల జాప్యంపై అసహనం వ్యక్తం చేస్తూ, అవసరమైతే ప్రత్యేక శిబిరాలు నిర్వహించాలని స్పష్టం చేశారు.

News December 23, 2025

NLG: అమ్మో ర్యాగింగ్ భూతం..!

image

కోటి ఆశలతో ఉన్నత విద్యను అభ్యసించడానికి కళాశాలల్లో అడుగుపెట్టే విద్యార్థులను ర్యాగింగ్ భూతం భయపెడుతుంది. జిల్లాలో తరచూ ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తుండడంతో ఆందోళన వ్యక్తం అవుతుంది. స్థానిక మెడికల్ కళాశాలలో ప్రారంభమైన ఈ విష సంస్కృతి క్రమంగా డిగ్రీ కళాశాలల్లోకి ప్రవేశించింది. తాజాగా స్థానిక గురుకుల కళాశాలలో తోటి విద్యార్థుల వేధింపుల కారణంగా ఓ విద్యార్థిని 4 రోజుల క్రితం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

News December 23, 2025

NLG: 2025@విషాదాల సంవత్సరం

image

2025లో NLG జిల్లాలో పలు భారీ రోడ్డు ప్రమాదాలు నమోదయ్యాయి. HYD-సాగర్, HYD- VJD, NKP- అద్దంకి హైవేలపై భారీ ప్రమాదాలు జగిరాయి. ఈ ప్రమాదాలలో వందలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. అనేకమంది గాయాలపాలై ఆస్పత్రుల్లో చికిత్సలు పొందారు. 2025లో రాచకొండ పరిధిలో (NLGలో కొంత భాగం ) మొత్తం 3,488 రోడ్డు ప్రమాదాలు జరగగా.. అందులో 650 మంది మరణించినట్లు సమాచారం.