News April 21, 2025

BREAKING: తూప్రాన్: ఇద్దరు పిల్లలతో వాగులో దూకిన తల్లి 

image

మాసాయిపేటకు చెందిన వడ్డేపల్లి మమత ఇద్దరు పిల్లలు పూజిత(7), తేజస్విని(5)తో హల్దీ వాగులో దూకింది. గమనించిన స్థానికులు ఆమెను బయటకు లాగగా పిల్లలు గల్లంతయ్యారు. మమత భర్త చనిపోవడంతో ఇద్దరు పిల్లలతో తల్లిగారి ఇంటి వద్ద ఉంటోంది. సమాచారం అందుకున్న పోలీసులు తూప్రాన్ ఎస్ఐ శివానందం ఆధ్వర్యంలో గాలింపు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News December 19, 2025

అంబేడ్కర్ విగ్రహ రూపశిల్పి మృతికి కేసీఆర్ సంతాపం

image

125 అడుగుల డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహ రూపశిల్పి, పద్మభూషణ్ రామ్ వాంజీ సుతార్ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ప్రపంచ స్థాయి శిల్ప కళా ప్రతిభతో కోహినూర్ వజ్రంలా నిలిచిన రామ్ సుతార్ సేవలు అపారం అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ గర్వకారణంగా నిలిచేలా అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని తీర్చిదిద్దారని ప్రశంసించారు. ఆయన మరణం శిల్ప కళా రంగానికి తీరని లోటని పేర్కొన్నారు.

News December 19, 2025

తూప్రాన్: తమ్ముడు సర్పంచ్.. అక్క వార్డు మెంబర్

image

తూప్రాన్ మండలంలో తమ్ముడు సర్పంచ్‌గా ఎన్నిక కాగా.. అక్క మనోహరాబాద్ మండలంలో వార్డు సభ్యురాలిగా ఎన్నికయ్యారు. తూప్రాన్ మండలం యావాపూర్ గ్రామ సర్పంచ్‌గా ఎంజాల స్వామి సర్పంచిగా ఎన్నికయ్యారు. మనోహరాబాద్ మండలం కాళ్లకల్ గ్రామపంచాయతీలో స్వామి అక్క కనిగిరి అనసూయ వార్డు సభ్యురాలుగా పోటీ చేసి గెలుపొందారు. తమ్ముడు సర్పంచ్.. అక్క వార్డు సభ్యురాలుగా కొనసాగుతున్నారు.

News December 19, 2025

MDK: సతులు సర్పంచ్‌లు.. పతులు వార్డ్ మెంబర్‌లు

image

నర్సాపూర్ మం. ఆవంచ, కాగజ్ మద్దూర్‌లో సర్పంచులుగా సతీమణులను గెలిపించుకొని, భర్తలు వార్డు సభ్యులుగా గెలుపొందారు. ఆవంచలో స్రవంతి సర్పంచ్‌గా గెలుపొంది, భర్త కర్ణాకర్ (Ex.సర్పంచ్) వార్డ్ సభ్యుడిగా గెలుపొందారు. కాగజ్ మద్దూర్లో విజయ సర్పంచ్‌గా గెలుపొంది, భర్త శివకుమార్ (Ex.సర్పంచ్) వార్డు సభ్యుడిగా గెలుపొందారు. వారు మాజీ సర్పంచ్‌లుగా కొనసాగి గ్రామానికి సేవలు అందించిన మళ్లీ గ్రామస్థులు పట్టం కట్టారు.