News March 25, 2025

BREAKING: దండెంపల్లి SLBC కాలువలో ఇద్దరు గల్లంతు

image

నల్గొండ జిల్లా దండెంపల్లి SLBC కాలువలో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. నేటి ఉదయం ఆరుగురు యువకులు దండెంపల్లి SLBC కాలువలో ఈతకు వెళ్లగా ప్రమాదవశాత్తు ఇద్దరు గల్లంతయ్యారని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News October 13, 2025

ఎస్పీ ఆధ్వర్యంలో గ్రీవెన్స్‌ డే.. 35 ఫిర్యాదులు స్వీకరణ

image

ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ప్రతీ సోమవారం నిర్వహించే పోలీస్‌ గ్రీవెన్స్‌ డే కార్యక్రమం జిల్లా పోలీసు కార్యాలయంలో విజయవంతంగా ముగిసింది. ఎస్పీ శరత్ చంద్ర పవార్ దాదాపు 35 మంది అర్జీదారులతో మాట్లాడి వారి సమస్యలను విన్నారు. సమస్యలను త్వరగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. ప్రజలకు పోలీస్ శాఖను చేరువ చేయడమే తమ లక్ష్యమని ఎస్పీ తెలిపారు.

News October 13, 2025

నల్గొండ: ఏనుగుల దాడిలో వ్యక్తి మృతి

image

చిట్యాలకు చెందిన బోరు బండి యజమాని ఒడిశాలో ఏనుగుల దాడిలో మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రుద్రారపు సైదులు దసరాకు ఇంటికి వచ్చాడు. బోరు పనుల కోసం శనివారం ఒడిశాలోని దేన్ కనాల్ జిల్లాలోని అటవీ ప్రాంతానికి వెళ్లాడు. అక్కడికి ఒక్కసారిగా వచ్చిన ఏనుగుల గుంపు దాడి చేయగా అక్కడికక్కడే మృతి చెందాడు. ఆదివారం మృతదేహన్ని చిట్యాలకు తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించారు.

News October 13, 2025

నల్గొండ జిల్లాలో 32.9 MM వర్షపాతం నమోదు

image

నల్గొండ జిల్లాలో ఆదివారం 32.9 మిల్లీమీటర్ల సగటు వర్షం కురిసింది. అత్యధికంగా NKPలో 78.9 మిల్లీమీటర్లు, చిట్యాలలో 30.0, కట్టంగూరులో 19.4 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. నకిరేకల్‌లో 13.7, కేతేపల్లిలో 17.6, తిప్పర్తిలో 23.2, నల్గొండలో 12.7, కనగల్‌లో 55.8, అనుములలో 76.2, నిడమనూరులో 41.2, త్రిపురారంలో 31.8, మాడుగులపల్లిలో 59.2, వేములపల్లిలో 32.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.