News February 27, 2025
BREAKING: ధారూర్లో మొండెం నుంచి వేరైన తల!

ధారూర్ PS పరిధిలో అనుమానాస్పదంగా మృతదేహం లభ్యమైంది. రైల్వే స్టేషన్ సమీపంలోని ట్రాక్పై మొండెం నుంచి తల వేరైన దృశ్యం స్థానికంగా కలకలం రేపింది. ఆత్మహత్యనా? ఎవరైనా హత్య చేసి ఉంటారా? అనే కోణంలో రైల్వే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని తాండూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News October 29, 2025
సంగారెడ్డి: తుఫాన్ ఎఫెక్ట్.. జాతీయ రహదారిపైకి వరద

మొంథా తుఫాన్ నేపథ్యంలో బుధవారం ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు సంగారెడ్డి జిల్లా కంది మండలం చేర్యాల గ్రామ శివారులో జాతీయ రహదారిపై భారీగా వరద నీరు నిలిచిపోయింది. దీంతో వాహనాదారుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రోడ్డు డౌన్గా ఉండడంతో ఈ ఇబ్బంది ఏర్పడింది. నేషనల్ హైవే అధికారులు స్పందించి వరద నీటిని తొలగించాలని ప్రయాణికులు కోరుతున్నారు.
News October 29, 2025
డోర్నకల్లో 104 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు

మహబూబాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మధ్యాహ్నం 12 గంటల వరకు వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. డోర్నకల్ మండలంలో 104.5 మిల్లీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదయింది. కురవిలోని అయ్యగారి పల్లిలో 90 మిల్లి మీటర్లు, మహబూబాబాద్ మండలంలో అమనగల్ 89.3, మల్యాలలో 70.8, గూడూరు మండలంలోని భూపతి పేటలో69.0, తొర్రూర్ 67.5, గార్లలో 65 మిల్లి మీటర్లు, గంగారంలో అత్యల్పంగా 8.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయింది.
News October 29, 2025
అర్హుల ఓట్లు తొలగిస్తే కాళ్లు విరగ్గొడతాం: బెంగాల్ మంత్రి

SIR పేరిట CAA అమలుకు BJP, EC ప్రయత్నిస్తున్నాయని బెంగాల్ మంత్రి ఫిర్హద్ హకీమ్ ఆరోపించారు. అర్హులైన ఒక్కరి ఓటు తొలగినా ఊరుకొనేది లేదని, కాళ్లు విరగ్గొడతామని హెచ్చరించారు. బీజేపీకి ఓటమి భయం పట్టుకుందని, మమత సీఎంగా ఉన్నన్నాళ్లూ రాష్ట్రంలో NRC అమలు కాబోదని స్పష్టం చేశారు. కాగా SIR పారదర్శకంగా జరుగుతుందని, అర్హులైన ఏ ఒక్కరి ఓటు తొలగబోదని బెంగాల్ CEO స్పష్టం చేశారు.


