News April 9, 2024

BREAKING: నంద్యాల టీడీపీ అభ్యర్థికి తప్పిన ప్రమాదం

image

నంద్యాలటీడీపీ అభ్యర్థి, మాజీ మంత్రి NMD ఫరూక్‌కు పెద్ద ప్రమాదం తప్పింది. మంగళవారం మధ్యాహ్నం కర్నూల్ వెళుతుండగా పాణ్యం సమీపంలోని తమ రాజుపల్లె వద్ద ఫరూక్ కాన్వాయ్ అదుపుతప్పి బర్రెలను ఢీకొంది. దీంతో కారులో బెలూన్స్ ఓపెన్ కావడంతో మాజీ మంత్రి ఫరూక్ స్వల్ప గాయాలతో బయటపడినట్లు టీడీపీ వర్గాలు వెల్లడించాయి. పాణ్యం అభ్యర్థి గౌరు చరిత అక్కడికి చేరుకొని ఆయనను ఆసుపత్రికి తరలించారు.

Similar News

News April 11, 2025

ఆదోని: రాజకీయ పార్టీ ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం

image

ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో స్పెషల్ సమ్మరీ రివిజన్ 2025 లో భాగంగా ఆదోని నియోజకవర్గంలోని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ సమీక్ష సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సమావేశంలో ఫారం 6,7,8 నూతన ఓటర్ నమోదు, చిరునామా, మొదలగు అంశాలపై ఎన్నికల అధికారి/ సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ అధికారులతో చర్చించారు.  ఎన్నికల ఉప తహశీల్దారు గాయత్రి, తదితరులు ఉన్నారు. 

News April 11, 2025

కర్నూలు జిల్లాలో రాబోయే 3 గంటల్లో వర్షం

image

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. కర్నూలు జిల్లాలోని పలు ప్రాంతాల్లో రాబోయే 3 గంటల్లో ఉరుములు మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రజలు సురక్షిత భవనాల్లో ఉండాలని సూచించింది. కాగా ఇవాళ సాయంత్రం నుంచి కర్నూలు నగరంలో వాతావరణ మారింది. అక్కడక్కడ వర్షాలు పడ్డాయి.

News April 11, 2025

కర్నూలు జిల్లా నేటి ముఖ్యాంశాలు

image

➤మంత్రాలయం: 25 జంటలకు తాలిబొట్లు, కాళ్ల మెట్టలు అందజేత ➤ జిల్లా నేతలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం➤ అతివేగం.. మహిళ ప్రాణం తీసింది➤ శిరువెళ్ల హత్యాయత్నం కేసులో ఇద్దరి అరెస్ట్➤ కర్నూలు జిల్లాలో ఎస్ఐల బదిలీ➤ వెల్దుర్తి: క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం వెళ్తే.. ఏమైందో చూడండి.!➤ హనుమాన్ శోభాయాత్రకి మంత్రి టీజీ భరత్ ఆహ్వానం➤ ఆదోని: రాజకీయ పార్టీ ప్రతినిధులతో సబ్ కలెక్టర్ సమావేశం.

error: Content is protected !!