News February 4, 2025
BREAKING: నాగర్కర్నూల్లో దారుణం.. తల్లిని చంపేశాడు!

నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం మహాదేవునిపేటలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన యాదమ్మ కుమారుడు కరుణాకర్ మద్యంతో పాటు డ్రగ్స్కు అలవాటు పడ్డాడు. ఈ క్రమంలో మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని కోపంతో కన్నతల్లిని గోడకేసి కొట్టి అతి కిరాతకంగా హత్య చేశాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News January 25, 2026
సిరిసిల్ల: కన్న పేగు కంటతడి.. తల్లడిల్లిన గోమాత

కన్న పేగు మనుషులకే కాదు జంతువులకు కూడా ఉంటుందని మరోసారి నిరూపితమైంది. తల్లి ప్రేమకు అద్దం పట్టిన ఘటన వీర్నపల్లి మండలం ఎర్రగడ్డతండాలో జరిగింది. బానోత్ రాజు పశువులు సమీప అటవీకి మేతకు వెళ్లాయి. అక్కడే ఉన్న చిరుత లేగదూడపై దాడి చేసి హతమార్చింది. ఇంటికి చేరుకున్న ఆవు యజమానిని తచ్చాడి మృతిచెందిన బిడ్డ కళేబరం వద్దకు తీసుకెళ్ళింది. లేగదూడ కళేబరాన్ని ముద్దాడుతూ గోమాత తల్లడిల్లిన తీరు కలచివేసింది.
News January 25, 2026
పన్ను వసూళ్లలో ఎదురేలేదు..

ప్రభుత్వానికి పన్నుల రూపంలో వచ్చే ఆదాయం గణనీయంగా పెరుగుతోంది. ట్యాక్స్ వసూళ్ల విషయంలో హాంకాంగ్(13.1%), ఇండోనేషియా(13.1%), మలేషియా(12%)ను ఇండియా వెనక్కి నెట్టిందని బ్యాంక్ ఆఫ్ బరోడా నివేదికలో వెల్లడించింది. ‘దేశ ట్యాక్స్-GDP నిష్పత్తి 19.6%గా ఉంది. పన్ను ఎగవేతలకు అడ్డుకట్ట, GST, డిజిటల్ లావాదేవీలకు ప్రోత్సాహం వంటివి ఇందుకు కారణం. జర్మనీ-38%, అమెరికా-25.6%తో మెరుగ్గా ఉన్నాయి’ అని పేర్కొంది.
News January 25, 2026
కామారెడ్డి: ఢిల్లీలో గణతంత్ర వేడుకలకు జిల్లా వాసి

నాగిరెడ్డిపేట మండలం తాండూర్ గ్రామానికి చెందిన కమ్మరి రాజు దేశ రాజధాని ఢిల్లీలో 26వ తేదీన నిర్వహించనున్న గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొననున్నారు. భారత ప్రభుత్వం నుంచి ఆయనకు పిలుపు రావడంతో శనివారం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఈ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి రాష్ట్రం నుంచి ఐదుగురు ఎంపికయ్యారు. అందులో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి కమ్మరి రాజు ఒక్కరు ఉండటం విశేషం.


