News February 4, 2025

BREAKING: నాగర్‌కర్నూల్‌లో దారుణం.. తల్లిని చంపేశాడు!

image

నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం మహాదేవునిపేటలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన యాదమ్మ కుమారుడు కరుణాకర్ మద్యంతో పాటు డ్రగ్స్‌కు అలవాటు పడ్డాడు. ఈ క్రమంలో మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని కోపంతో కన్నతల్లిని గోడకేసి కొట్టి అతి కిరాతకంగా హత్య చేశాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News October 19, 2025

గూగుల్ రాక ఆరంభం మాత్రమే: లోకేశ్

image

దేశంలోని చాలా రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ సర్కారులున్నాయని, కానీ APలో డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ ఉందని మంత్రి లోకేశ్ అన్నారు. AUSలోని తెలుగువారితో మాట్లాడుతూ ‘ఇక్కడి వారంతా AP అంబాసిడర్లలా పని చేయాలి. పెట్టుబడుల కోసం పక్క రాష్ట్రాలతో చిన్నచిన్న యుద్ధాలు జరుగుతున్నాయి. నన్ను ఎన్నో మాటలు అంటున్నా క్రీడా స్ఫూర్తితో ముందుకెళ్తున్నా. గూగుల్ రాక ఆరంభం మాత్రమే. ఇకపై అనేక కంపెనీలు వస్తాయి’ అని తెలిపారు.

News October 19, 2025

సిద్దిపేట: కాల్చకుండానే పేలుతున్న పటాకుల ధరలు !

image

ఉమ్మడి మెదక్ జిల్లాలో దీపావళి పటాకుల ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. టపాసులపై GST, కెమికల్స్ ధరలు తగ్గినా ధరలు మాత్రం దిగలేదు. చిన్నా పెద్ద తేడా లేకుండా కాల్చే కాకర పుల్లల ధరలు సైతం గతంతో పోలిస్తే భారీగా పెరిగాయి. ఒక్కో దాని కుల్ల ప్యాకెట్ ధర రూ.30 నుంచి రూ.100 వరకు పలుకుతుంది. చిచ్చుబుడ్డులు, లక్ష్మి, సుతిల్ బాంబులతో పాటు ఇతర టపాకాయలు ధరలు ఎక్కువగానే ఉన్నాయి.

News October 19, 2025

టపాసులు కాల్చే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి: భూపాలపల్లి కలెక్టర్

image

దీపావళి పండగ సందర్భంగా టపాసులు కాల్చే సమయంలో జిల్లా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని కోరారు. దీపావళి  వెలుగులు ప్రతి ఇంటికి సంతోషం, ఆరోగ్యం, ఆనందాన్ని నింపాలని ఆయన ఆకాంక్షించారు.