News April 15, 2025

BREAKING.. నాగర్‌కర్నూల్ జిల్లాలో దారుణ హత్య

image

నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలంలో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఘటన మంగళవారం జరిగింది. స్థానికుల వివరాలు.. నడింపల్లి గ్రామానికి చెందిన వీరయ్యను గ్రామ శివారులోని HYD-అచ్చంపేట రోడ్డుపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు గొడ్డలితో నరికి హత్య చేశారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరకుని విచారిస్తున్నారు.

Similar News

News December 8, 2025

స్కూళ్లకు సెలవులపై ప్రకటన

image

TG: ఈ నెల 11న తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో స్కూళ్లకు రెండు రోజులు సెలవు ఇస్తూ డీఈవోలు ఉత్తర్వులు జారీ చేశారు. పోలింగ్ జరిగే పాఠశాలలకు 10, 11న సెలవు ఉంటుందని పేర్కొన్నారు. 10న పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్ల దృష్ట్యా, 11న పోలింగ్ ఉండటంతో సెలవులు ఇస్తున్నట్లు వెల్లడించారు. కాగా తొలి విడతలో 4,236 గ్రామాల్లో పోలింగ్ జరగనుండగా ఉపాధ్యాయులు విధుల్లో పాల్గొననున్నారు.

News December 8, 2025

ఎచ్చెర్ల: పీజీలో సీట్లకు ప్రవేశాలు

image

డా. బీఆర్ అంబేడ్కర్ వర్సిటీ, ఎచ్చెర్లలో వివిధ పీజీ కోర్సుల్లో (ఎం.ఎ, ఎం.కాం, ఎం.ఎస్సీ, ఎం.ఇడి) మిగిలిన సీట్లకు తక్షణ ప్రవేశాలు నిర్వహిస్తున్నట్లు రిజిస్ట్రార్ బి. అడ్డయ్య సోమవారం తెలిపారు. ఈ ప్రవేశాలు ఈ నెల 9న మంగళవారం నుంచి క్యాంపస్‌లో జరుగుతాయన్నారు. ఏపీపీజీసెట్ రాసినా, రాయకపోయినా సీటు పొందని వారు ఈ స్పాట్ అడ్మిషన్స్‌కు హాజరుకావచ్చని పేర్కొన్నారు.

News December 8, 2025

రామచంద్రపురంలో డెంగ్యూ కలకలం

image

రామచంద్రపురం అంకంవారి వీధిలో ఒక మహిళకు డెంగ్యూ సోకడంతో వైద్యారోగ్య శాఖ యంత్రాంగం అప్రమత్తమైంది. డీఎంఓ వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో సోమవారం ఆ వీధిలో సిబ్బంది ఇంటింటి సర్వే చేపట్టారు. పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు, నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని సూచించారు. జ్వరంగా అనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.