News February 20, 2025

BREAKING: నిజామాబాద్‌లో విషాదం.. ముగ్గురి మృతి

image

నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. బోధన్ మండలం పెగడపల్లిలో కరెంట్ షాక్‌తో ముగ్గురు చనిపోయారు. ట్రాన్స్‌ఫార్మర్ వద్ద చోరీ చేస్తుండగా వారికి షాక్ కొట్టినట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతులంతా రెంజల్ మండలం సాటాపూర్ గ్రామానికి చెందిన గంగారాం, బాలమణి, కిషన్‌గా గుర్తించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News November 2, 2025

కల్తీ కుంకుమని ఇలా గుర్తించండి

image

కొనే ముందే కుంకుమలోని కల్తీని కనిపెట్టడం మంచిదంటున్నారు నిపుణులు. ఇందుకోసం కొన్ని చిట్కాలు..* నేచురల్ కలర్ కాకుండా గులాబీ, కాషాయం, మరీ ముదురుగా ఉంటే కృత్రిమ రంగులు వాడారని అర్థం. * సహజంగా చేసిన కుంకుమ రంగు చేతికి అంటుకోదు.. అదే అంటుకుందని గుర్తిస్తే కల్తీ చేశారని అర్థం. * గ్లాసీ లుక్‌ ఉండే కుంకుమల్లో హానికారక డైలు కలిపినట్లే. * నకిలీ కుంకుమైతే నీళ్లలో కలిపితే కరిగిపోకుండా నీటి రంగు మారుతుంది.

News November 2, 2025

నూజివీడులో నేటి మాంసం ధరలు ఇలా

image

నూజివీడులో ఆదివారం మాంసం ధరలు ఇలా ఉన్నాయి. కిలో మటన్ రూ.800, చికెన్ రూ.200 నుంచి 220 రూపాయలు, చేపలు కిలో రూ.180 రూపాయల నుంచి 350 రూపాయల వరకు, రొయ్యలు కిలో రూ.350 రూపాయలు, ఏలూరు నగరంలో మటన్ కిలో రూ.900, చేపలు కిలో రూ.200 నుంచి 380 రూపాయలు, రొయ్యలు కిలో రూ.350 రూపాయలుగా విక్రయిస్తున్నారు.

News November 2, 2025

HYD: KCR తన కుటుంబాన్ని బాగు చేసుకున్నాడు: కిషన్ రెడ్డి

image

‘బంగారు తెలంగాణ’ పేరిట KCR తన కుటుంబాన్ని బంగారం చేసుకున్నాడని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. జూబ్లీహిల్స్‌లో శనివారం ఆయన మాట్లాడారు. ప్రధాని మోదీ 83 కోట్ల మందికి ఉచిత బియ్యం, ఉజ్వల పథకం, మహిళలకు రుణాలు అందిస్తూ నిరంతరం ప్రజల కోసం పనిచేస్తున్నారన్నారు. జూబ్లీహిల్స్ అభివృద్ధి కోసం బీజేపీని గెలిపించాలని కిషన్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను గాలికొదిలిందన్నారు.