News April 14, 2025

BREAKING: పటాన్‌చెరు: రోకలిబండతో కొట్టి భార్యను హత్య చేసిన భర్త

image

పటాన్ చెరు మండలం పెద్దకంజర్ల గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. భార్యను రోకలిబండతో కొట్టి భర్త రమేష్ హతమార్చాడు. భార్య భర్తల మధ్య గొడవ జరగగా అడ్డువచ్చిన అత్త కవితపై కూడా రమేష్ దాడికి పాల్పడ్డాడు. దీంతో భార్య అక్కడికక్కడే మృతి చెందగా..అత్తకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News November 28, 2025

తంగళ్ళపల్లి: తల్లి మరణం భరించలేక తనయుడి ఆత్మహత్య

image

నిన్నటి నుంచి కనిపించకుండా పోయిన తంగళ్ళపల్లికి చెందిన లలిత సిరిసిల్ల మానేరు వాగులో దూకి ఆత్మహత్య చేసుకుంది. తల్లి మరణించిన విషయం తెలుసుకున్న కొడుకు అభిలాష్ అదే మానేరు వాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అభిలాష్ సిరిసిల్లలోని సర్దాపూర్ బెటాలియల్లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. తల్లి, కుమారుడు మరణించడంతో గ్రామంలో తీవ్రవిషాదం చోటు చేసుకుంది.

News November 28, 2025

తంగళ్లపల్లి: ఎస్పీ ఆకస్మిక తనిఖీలు

image

తంగళ్లపల్లి మండలం జిల్లెల్లలోని చెక్పోస్టును సిరిసిల్ల ఎస్పీ మహేష్ బి గితే శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనిఖీల సమయంలో సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి అక్రమ నగదు, మద్యం రవాణాను అరికట్టాలని సూచించారు. శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.

News November 28, 2025

కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు

image

‘దిత్వా’ తుఫాన్ ప్రభావంతో కోస్తా, రాయలసీమలో రేపు, ఎల్లుండి భారీ వర్షాలు కురుస్తాయని APSDMA వెల్లడించింది. ‘నైరుతి బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న శ్రీలంక తీరంలో తుఫాన్ నెమ్మదిగా కదులుతోంది. గడచిన 6hrsలో 4kms వేగంతో కదులుతూ పుదుచ్చేరికి 420kms, చెన్నైకి 520kms దూరంలో కేంద్రీకృతమైంది. ఎల్లుండి నైరుతి బంగాళాఖాతం ఉత్తర TN, పుదుచ్చేరి, ద.కోస్తా తీరాలకు చేరుకునే అవకాశముంది’ అని ఓ ప్రకటనలో పేర్కొంది.