News April 14, 2025

BREAKING: పటాన్‌చెరు: రోకలిబండతో కొట్టి భార్యను హత్య చేసిన భర్త

image

పటాన్ చెరు మండలం పెద్దకంజర్ల గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. భార్యను రోకలిబండతో కొట్టి భర్త రమేష్ హతమార్చాడు. భార్య భర్తల మధ్య గొడవ జరగగా అడ్డువచ్చిన అత్త కవితపై కూడా రమేష్ దాడికి పాల్పడ్డాడు. దీంతో భార్య అక్కడికక్కడే మృతి చెందగా..అత్తకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News November 23, 2025

మెదక్‌లో JOBS.. APPLY NOW

image

మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పరిధిలోని మెదక్ సఖి సెంటర్‌లో పొరుగు సులభ పద్ధతిలో దిగువ తెలిపిన ఉద్యోగాల నియామకానికి అర్హులైన మహిళ అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా అధికారి హేమ భార్గవి సూచించారు. సైకో సోషల్ కౌన్సిలర్, మల్టీ పర్పస్ స్టాఫ్/కుక్ పోస్టులకు డిసెంబర్ 10లోపు జిల్లా సంక్షేమ అధికారి, మహిళా, శిశు, దివ్యాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ కార్యాలయం మెదక్‌లో సమర్పించాలని తెలిపారు.

News November 23, 2025

కేజీ రూపాయి.. డజను రూ.60!

image

AP: మూడేళ్లుగా టన్ను <<18336571>>అరటి<<>> రూ.25వేలు పలకగా ఈసారి రూ.1,000లోపు పడిపోవడంతో రాయలసీమ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కేజీకి రూపాయి మాత్రమే వస్తోంది. కిలోకి 6, 7 కాయలు వస్తాయి. 2 కేజీలు అంటే డజను. బయట మార్కెట్లో వ్యాపారులు డజను అరటి రూ.40-60కి అమ్ముతున్నారు. ఈ లెక్కన రైతుకు రూ.2 మాత్రమే వస్తున్నాయంటే వారి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. లోపం ఎక్కడ ఉంది? COMMENT.

News November 23, 2025

హనుమకొండ: కష్టకాలంలో పార్టీ వెంట ఉంటూ..!

image

హనుమకొండ డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న పశ్చిమ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డిని టీపీసీసీ ఉపాధ్యక్షుడిగా నియమించిన నేపథ్యంలో తాజాగా కుడా ఛైర్మన్ వెంకటరామిరెడ్డిని ఏఐసీసీ డీసీసీ అధ్యక్షుడిగా నియమించింది. కష్టకాలంలో పార్టీ వెంట ఉంటూ, కార్యకర్తలకు అండగా ఉన్న వెంకటరామిరెడ్డికి తగిన గుర్తింపు లభించిందని జిల్లాలోని కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.