News April 14, 2025
BREAKING: పటాన్చెరు: రోకలిబండతో కొట్టి భార్యను హత్య చేసిన భర్త

పటాన్ చెరు మండలం పెద్దకంజర్ల గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. భార్యను రోకలిబండతో కొట్టి భర్త రమేష్ హతమార్చాడు. భార్య భర్తల మధ్య గొడవ జరగగా అడ్డువచ్చిన అత్త కవితపై కూడా రమేష్ దాడికి పాల్పడ్డాడు. దీంతో భార్య అక్కడికక్కడే మృతి చెందగా..అత్తకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 10, 2025
వరుసగా అబార్షన్లు అవుతున్నాయా?

గర్భం దాల్చిన ప్రతిసారీ అబార్షన్ అవుతుంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. రెండోసారి అబార్షన్ జరిగితే డాక్టర్ పర్యవేక్షణలో టెస్టులు చేయించి మందులు వాడాలి. గర్భస్రావం జరిగినప్పుడు పిండాన్ని టెస్టుకి పంపి జన్యు సమస్యలున్నాయో తెలుసుకోవచ్చు. మేనరికంలో అయితే దంపతులకి టెస్టులు చేయాల్సి ఉంటుంది. వీటితో పాటు రక్తపరీక్షలు, స్కానింగ్, థైరాయిడ్ టెస్టులు జరిపి వాటికి తగ్గ ట్రీట్మెంట్ చేయాలి.
News November 10, 2025
తిరుపతి: “H.A.N.U.M.A.N” ప్రాజెక్ట్ అంటే ఏంటి…?

మానవ, అడవి జంతువుల ఘర్షణ పెరుగుతున్న నేపథ్యంలో AP ప్రభుత్వం “H.A.N.U.M.A.N” ప్రాజెక్ట్ను ప్రకటించింది. Healing and Nurturing Units for Monitoring, Aid and Nursing of Wildlife అని అర్థం. ఈ ప్రాజెక్టు ద్వారా అడవి జంతువులతో జరిగే ప్రమాదాలను తగ్గించడం, ప్రజల ప్రాణాలు, పంటలు, పశువులను రక్షించడం ముఖ్య లక్ష్యంగా ప్రభుత్వం ప్రకటించింది.
News November 10, 2025
చిలుకూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

చిలుకూరు మిట్స్ కాలేజీ సమీపంలో హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, బొలెరో ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బొలెరో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా, పలువురు గాయాలపాలయ్యారు. సాగర్ సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి సత్తుపల్లికి సిమెంట్ లోడుతో వెళ్తున్న లారీ, కోదాడ నుంచి హుజూర్నగర్ వెళ్తున్న బొలెరోను ఢీకొట్టినట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి వివరాలు సేకరిస్తున్నారు.


