News June 14, 2024
BREAKING.. పెద్దపల్లి: ఆరేళ్ల బాలికపై హత్యాచారం

పెద్దపల్లి జిల్లాలో విషాదం నెలకొంది. ఆరేళ్ల బాలికపై బుధవారం రాత్రి వ్యక్తి అత్యాచారం చేసి హత్యచేశాడు. స్థానికుల ప్రకారం.. ఓ రైస్మిల్లులో తల్లితో పాటు నిద్రిస్తున్న బాలికను రైస్మిల్ డ్రైవర్ బలరాం ఎత్తుకెళ్లాడు. సమీప పొదల్లోకి తీసుకెళ్లి హత్యాచారం చేశాడు. బాలికలేదని తల్లి గుర్తించి తోటి కార్మికులతో కలిసి వెతకడంతో విషయం బయటపడింది. నిందితుడిని రైస్ మిల్లు కార్మికులు పోలీసులకు అప్పగించారు.
Similar News
News December 6, 2025
హోంగార్డుల సేవలు అమూల్యం: సీపీ గౌష్ ఆలం

63వ హోంగార్డు వ్యవస్థాపక దినోత్సవాన్ని కరీంనగర్ పోలీస్ కమిషనరేట్లో శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీపీ గౌష్ ఆలం, శాంతిభద్రతల పరిరక్షణలో హోంగార్డుల పాత్ర కీలకమని కొనియాడారు. అత్యవసర విధుల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన సిబ్బందికి ఆయన ప్రశంసాపత్రాలు అందజేసి సత్కరించారు. క్రీడా పోటీలలో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు పంపిణీ చేశారు.
News December 6, 2025
కరీంనగర్: ఈ నెల 22 వరకూ ఫీజు చెల్లించవచ్చు

డాక్టర్ బీ.ఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ పీజీ ప్రథమ, ద్వితీయ, ఎంబీఏ తృతీయ, ద్వితీయ విడత సప్లిమెంటరీ పరీక్షా ఫీజు గడువు ఈనెల 22 వరకు ఉన్నట్లు కరీంనగర్ స్టడీ సెంటర్ కో-ఆర్డినేటర్ ఏం సత్య ప్రకాష్ తెలిపారు. ఫీజును ఆన్లైన్లో చెల్లించవచ్చని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు అధ్యయన కేంద్రంలో సంప్రదించాలని సూచించారు.
News December 6, 2025
EVMలకు కట్టుదిట్టమైన భద్రత.. వివిధ పార్టీలతో పరిశీలన

ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ సమీపంలోని ఈవీఎం గోదాంను అదనపు కలెక్టర్ లక్ష్మికిరణ్ శనివారం తనిఖీ చేశారు. ఆర్డీఓ మహేశ్వర్తో పాటు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ సహా పలు పార్టీల ప్రతినిధులు ఈ పరిశీలన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈవీఎంలు, వీవీప్యాట్లకు ఏర్పాటు చేసిన కట్టుదిట్టమైన భద్రతా చర్యలు, పోలీస్ గార్డుల విధులను ఆమె పర్యవేక్షించారు.


