News June 5, 2024

BREAKING.. ప్రారంభమైన MLC ఓట్ల లెక్కింపు

image

నల్గొండలో పట్టభద్రుల ఎమ్మెల్సీ మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఒక్కో రౌండ్‌లో 96 టేబుళ్లపై 96 వేల ఓట్లు లెక్కించనున్నారు. కాగా, తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు 4రౌండ్ల‌లో పూర్తి కానుంది. మొత్తం 3,36,013 ఓట్లు పోలవగా.. అందులో 2139 ఓట్లు పోస్టల్ బ్యాలెట్‌ ఓట్లున్నాయి. అర్ధరాత్రిలోపు తొలిప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యే అవకాశం ఉంది.

Similar News

News October 31, 2025

NLG: 6.7 KM పొడవునా దెబ్బతిన్న రోడ్లు

image

జిల్లాలో రోడ్డు భవనాల శాఖ పరిధిలోని 24 ప్రాంతాల్లో 6.7 కిలోమీటర్ల పొడవున రోడ్లు దెబ్బతినగా అందులో 15 ప్రాంతాల్లో పూర్తిగా ధ్వంసమై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాటిల్లో గురువారం 7 ప్రాంతాల్లో రాకపోకలను పునరుద్ధరించారు. వాటి తాత్కాలిక మరమ్మతులకు రూ.35 లక్షలు అవసరమని అధికారులు అంచనా వేశారు. శాశ్వత మరమ్మతులకు రూ.9.70 కోట్లు అవసరమని ప్రతిపాదించినట్లు అధికారులు తెలిపారు.

News October 31, 2025

NLG: రూ.కోట్లల్లో పేరుకుపోయిన బకాయిలు

image

బకాయిల వసూళ్ల విషయంలో నల్గొండ మున్సిపల్ రెవెన్యూ విభాగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. రూ.కోట్లలో రావాల్సి ఉన్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా పనిచేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. మున్సిపాలిటీ పరిధిలోని 48 వార్డుల్లో ఈ ఏడాది ఆస్తి పన్ను రూ.9.30 కోట్లు బకాయిలు ఉన్నాయి. ఇకపోతే పాత బకాయిలు రూ. 33.80 కోట్లు ఉన్నాయి. మొత్తంగా రూ.43.11 కోట్లు ఆస్తి పన్ను బకాయిలు పేరుకుపోయాయి.

News October 31, 2025

NLG: ఆ నిబంధనలు.. రైతులతో పరిహాసమే!

image

అటు ప్రకృతి.. ఇటు పాలకులు రైతులకు కన్నీరు తెప్పిస్తున్నారు. మొంథా తుఫాన్ ప్రభావంతో జిల్లాలో భారీగానే పంట నష్టం జరిగింది. చేతికొచ్చిన పంట నేలవాలడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. 33 శాతానికి పైగా దెబ్బతింటేనే పరిహారం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో జిల్లాలో నష్టపోయిన రైతులందరికీ పరిహారం అందే సూచనలు కనిపించడం లేదు. జిల్లాలో ప్రాథమిక అంచనా ప్రకారం 61,511 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది.