News January 18, 2025
BREAKING: బస్సులు ఢీ.. గుంటూరు వాసులు మృతి

సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బస్సులు గుంటూరు నుంచి HYD వెళ్తుండగా SV కళాశాల సమీపంలో ఢీకొన్నాయి. ఈ ఘటనలో క్లినర్ బస్సు అద్దంలో నుంచి ఎగిరిపడగా.. అతడి పైనుంచి బస్సు వెళ్లడంతో స్పాట్లోనే చనిపోయాడు. గుండెపోటుతో ప్రయాణికుడు మృతిచెందాడు. మృతిచెందిన వారు గుంటూరు వాసులు సాయి, రసూల్గా పోలీసులు గుర్తించారు. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 24, 2025
GNT: నేడు వంగర వెంకట సుబ్బయ్య జయంతి

తెలుగు సినిమా, నాటక రంగాలలో ప్రసిద్ధి చెందిన హాస్యనటుడు వంగర వెంకట సుబ్బయ్య జయంతి నేడు. ఆయన 1897, నవంబర్ 24న సంగం జాగర్లమూడిలో జన్మించారు. రంగస్థల ప్రస్థానంలో తెనాలిలో స్థిరపడి, ‘శ్రీకృష్ణ తులాభారం’ నాటకంలో వసంతకుడి వేషంతో కళాహృదయుల మన్ననలు అందుకున్నారు. ఆయన దాదాపు వందకు పైగా తెలుగు చిత్రాలలో నటించారు. ‘పెద్దమనుషులు’, ‘కన్యాశుల్కం’, ‘మాయాబజార్’ వంటి చిత్రాలలో తన హాస్యంతో ప్రేక్షకులను అలరించారు.
News November 24, 2025
పీజీఆర్ఎస్ సద్వినియోగం చేస్కోండి: కలెక్టర్

Meekosam.ap.gov.inలో PGRS అర్జీలు సమర్పించవచ్చని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. నేరుగా పీజీఆర్ఎస్లో కూడా అందించవచ్చన్నారు. గుంటూరు కలెక్టరేట్లో సోమవారం పీజీఆర్ఎస్ జరుగుతుందని చెప్పారు. అర్జీ స్థితి గతులను 1100 టోల్ ఫ్రీకి ఫోన్ చేసి తెలుసుకోవచ్చని అన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సమస్యలను పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు.
News November 24, 2025
పీజీఆర్ఎస్ సద్వినియోగం చేస్కోండి: కలెక్టర్

Meekosam.ap.gov.inలో PGRS అర్జీలు సమర్పించవచ్చని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. నేరుగా పీజీఆర్ఎస్లో కూడా అందించవచ్చన్నారు. గుంటూరు కలెక్టరేట్లో సోమవారం పీజీఆర్ఎస్ జరుగుతుందని చెప్పారు. అర్జీ స్థితి గతులను 1100 టోల్ ఫ్రీకి ఫోన్ చేసి తెలుసుకోవచ్చని అన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సమస్యలను పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు.


