News May 19, 2024
BREAKING: బాన్సువాడలో రెండు కుళ్లిన మృతదేహలు

బాన్సువాడ న్యూవీక్లీ మార్కెట్లో నూతనంగా నిర్మిస్తున్న ఓ భవనంలో రెండు కుళ్లిన మృతదేహలు కలకలం రేపాయి. ఓ షట్టర్లో బాలుడు, మహిళ శవాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సీఐ కృష్ణ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. 3 రోజుల క్రితం ఈ ఇద్దరు మృతి చెందినట్లు అనుమానిస్తున్నారు. మృతదేహలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరి వివరాలు తెలిస్తే బాన్సువాడ CI కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.
Similar News
News January 5, 2026
నిజామాబాద్: సంక్రాంతి ప్రయాణమా.. జాగ్రత్తలు తప్పనిసరి!

సంక్రాంతి సెలవులకు వెళ్లే ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సూచించారు. నగలు, విలువైన వస్తువులను బ్యాంక్ లాకర్లలో ఉంచాలని, ఇంటికి బలమైన సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ వాడాలని చెప్పారు. ప్రయాణ వివరాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయవద్దన్నారు. సీసీ కెమెరాల ద్వారా ఇంటిని పర్యవేక్షించాలన్నారు. అనుమానితులు కనిపిస్తే వెంటనే ‘డయల్ 100’కు లేదా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని సీపీ కోరారు.
News January 5, 2026
NZB: చైనా మంజాతో ప్రాణహాని జరిగితే హత్య కేసు: సీపీ

చైనా మాంజా వాడకంపై పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. మాంజా వల్ల ఎవరికైనా ప్రాణహాని కలిగితే బాధ్యులపై ‘హత్యా నేరం’ (Murder Case) కింద కేసు నమోదు చేస్తామన్నారు. మాంజా విక్రయించినా, నిల్వ చేసినా కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఎవరి వద్దనైనా మాంజా ఉంటే పోలీస్ స్టేషన్లో అప్పగించాలని, విక్రయించే వారి గురించి తెలిస్తే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని కోరారు.
News January 5, 2026
NZB: చైనా మంజాతో ప్రాణహాని జరిగితే హత్య కేసు: సీపీ

చైనా మాంజా వాడకంపై పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. మాంజా వల్ల ఎవరికైనా ప్రాణహాని కలిగితే బాధ్యులపై ‘హత్యా నేరం’ (Murder Case) కింద కేసు నమోదు చేస్తామన్నారు. మాంజా విక్రయించినా, నిల్వ చేసినా కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఎవరి వద్దనైనా మాంజా ఉంటే పోలీస్ స్టేషన్లో అప్పగించాలని, విక్రయించే వారి గురించి తెలిస్తే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని కోరారు.


