News November 3, 2024

BREAKING: మణుగూరులో విషాదం.. విద్యుత్ ఘాతంతో ఇద్దరు మృతి

image

మణుగూరు మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు హై స్కూల్లో కరెంట్ షాక్‌తో ఇద్దరు వాచ్‌మెన్లు మృతి చెందారు. ఈరోజు ఉ.5.30కు పాఠశాల ఆవరణలో ఉన్న విద్యుత్ మెయిన్ తీగలకు పాఠశాలలో ఉన్న ఇనుప స్తంభం తీస్తుంగా.. విద్యుత్ తీగలకు తగలడంతో మణుగూరుకు చెందిన ఉపేందర్, రత్నం వాచ్‌మెన్లు అక్కడికక్కడే మృతి చెందారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు వారి మృతితో దుఃఖసాగరంలో మునిగారు.

Similar News

News November 18, 2025

మంత్రి పొంగులేటి పర్యటన వాయిదా

image

రేపు సత్తుపల్లి, కల్లూరు, పెనుబల్లి, కూసుమంచి మండలాల్లో జరగాల్సిన మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పర్యటన అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు ఈ మార్పును గమనించాలని మంత్రి క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. తదుపరి పర్యటన తేదీని త్వరలోనే ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు.

News November 18, 2025

సాధారణ ప్రసవాలు పెంచాలి: కలెక్టర్

image

ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో నమ్మకం పెరగాలంటే సేవల నాణ్యత మెరుగుపడాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. తిరుమలాయపాలెం, నేలకొండపల్లి ప్రాంతాల్లో సాధారణ ప్రసవాలు పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గర్భిణీల ఫాలోఅప్‌ను ఆశా కార్యకర్తలతో సమన్వయం చేయాలని, ప్రైవేట్ ఆసుపత్రులకు రిఫరల్ అవకాశం ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు.

News November 18, 2025

రాష్ట్రంలో ఖమ్మం జిల్లా ముందంజ

image

పేరెంట్-టీచర్స్ మీటింగ్‌ అమలులో రాష్ట్ర స్థాయిలో ఖమ్మం జిల్లా ముందంజలో నిలిచింది. జిల్లాలో 1,236 పాఠశాలకు 1,146 పాఠశాలలు నమోదై 92.7శాతంతో ముందంజలో నిలిచిందని అధికారులు పేర్కొన్నారు. తల్లిదండ్రులు పిల్లలకు ఆనందకరమైన బాల్యం అందించేలా సూచనలు చేశారు. క్రీడలు, డాన్స్, ప్రసంగం, కథలు చెప్పడం తదితర అంశాల్లో ప్రోత్సహించాల్సిన ఆవశ్యకతను వివరించారు.