News April 14, 2025
BREAKING: మహబూబ్నగర్లో తీవ్ర విషాదం

మహబూబ్నగర్లో ఈరోజు తీవ్ర విషాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. మహబూబ్నగర్ పరిధిలోని ప్రభుత్వ వైద్య కళాశాల వద్ద క్వారీ గుంతలో ఈతకు దిగిన ముగ్గురు యువకులు నీట మునిగారు. ఈ ప్రమాదంలో ఒకరు చనిపోగా మరో ఇద్దరు గల్లంతయ్యారు. ఒక యువకుడి మృతదేహం లభ్యం కాగా మరో ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇద్దరు యువకులు మునిగిపోతుండగా వాళ్లని కాపాడబోయి మరో యువకుడు కూడా మునిగిపోయాడు.
Similar News
News November 19, 2025
NRPT: బాలల భవిష్యత్తుకు కృషి చేయాలి: కలెక్టర్

నారాయణపేటలో బాలల బంగారు భవిష్యత్తు కోసం సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని, బాలల హక్కుల సంరక్షణలో భాగస్వాములవ్వాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పిలుపునిచ్చారు. మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమశాఖ జిల్లా బాలల సంరక్షణ విభాగం ఆధ్వర్యంలో జరుగుతున్న బాలల హక్కుల వారోత్సవాలలో భాగంగా నిర్వహించిన సంతకాల సేకరణ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
News November 19, 2025
NRPT: 3వ జిల్లా మహా సభలు విజయవంతం చేయాలి

జిల్లా కేంద్రంలో జరిగే PDSU జిల్లా మహా సభలను విజయవంతం చేయాలని సంఘం జిల్లా అధ్యక్షుడు సాయికుమార్ అన్నారు. మహా సభల వాల్ పోస్టర్లను బుధవారం నారాయణపేట పట్టణంలోని చిట్టెం నర్సిరెడ్డి మెమోరియల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. ఈనెల 22, 23 రెండు రోజులు మహా సభలు జరుగుతాయని, విద్యార్థులు, విద్యావంతులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కోరారు. నేతలు పాల్గొన్నారు.
News November 19, 2025
ఏలూరు: పోలింగు కేంద్రాలు మార్పులు, చేర్పులపై సమీక్ష

జిల్లాలో ఖచ్చితత్వంతో కూడిన ఓటర్ల జాబితాపై కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులతో బుధవారం సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఏడు నియోజక వర్గాలలో ఇప్పటికే 1,744 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. 5 పోలింగ్ స్టేషన్లు నామకరణం మార్పు కోసం ప్రతిపాదనలు, 23 పోలింగ్ స్టేషన్లు స్థానమార్పు కోసం ప్రతిపాదనలు, 137 క్రొత్త పోలింగ్ స్టేషన్లు కోసం ప్రతిపాదనలు అందాయని అన్నారు.


