News February 6, 2025
BREAKING: మహబూబ్నగర్ జిల్లాలో MURDER

మహబూబ్నగర్ జిల్లాలో దారుణ హత్య జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. నందికొట్కూర్ వాసి షేక్ అబ్దుల్ రహమాన్ కూతురిని అదే గ్రామానికి చెందిన అలీ ఖాన్(36) తరచూ వేధిస్తున్నాడు. ఈక్రమంలో చిన్నచింతకుంట మండలం తిరుమలాపూర్లో ఈరోజు కూడా మళ్లీ ఆమెను వేధించసాగాడు. విషయం తెలుసుకున్న అబ్దుల్ రహమాన్ తన కూతురిని వేధిస్తావా అంటూ అలీని రాడ్డుతో కొట్టి చంపేశాడు. పోలీసులు వచ్చి మృతదేహాన్ని తరలించారు.
Similar News
News November 17, 2025
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పురోగతిని పరిశీలించిన కలెక్టర్

టేక్మాల్ మండలంలో వివిధ గ్రామాల్లో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతి పనులను కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. పెండింగ్లో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్ అంశం మీద సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముందుగా అన్ని గ్రామాల వారీగా ఇంకా నిర్మాణాలు ప్రారంభించకుండా ఉన్న వాటి వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు.
News November 17, 2025
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పురోగతిని పరిశీలించిన కలెక్టర్

టేక్మాల్ మండలంలో వివిధ గ్రామాల్లో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతి పనులను కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. పెండింగ్లో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్ అంశం మీద సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముందుగా అన్ని గ్రామాల వారీగా ఇంకా నిర్మాణాలు ప్రారంభించకుండా ఉన్న వాటి వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు.
News November 17, 2025
గంజాయి టెస్ట్.. స్పాట్లోనే రిజల్ట్స్!

TG: గంజాయిని శాశ్వతంగా అరికట్టడానికి పోలీస్ శాఖ నయా టెక్నాలజీని ప్రవేశపెట్టింది. అనుమానం ఉన్నవారిని ‘యూరిన్ టెస్ట్ కిట్’తో టెస్ట్ చేసి స్పాట్లోనే ఫలితాన్ని నిర్ధారిస్తారు. సైబరాబాద్, కరీంనగర్, రామగుండం, నిజామాబాద్, సిద్దిపేట కమిషనరేట్ల పరిధిలోని కొన్ని పోలీస్ స్టేషన్లను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. ఈ మేరకు ఆయా పీఎస్లకు యూరిన్ కిట్లను పంపిణీ చేసినట్లు సమాచారం.


