News March 28, 2025
BREAKING: మహబూబ్నగర్: విద్యార్థి ఆత్మహత్య

ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. పీర్ల గుట్ట సమీపంలో ఉండే మణిదీప్(18) ఉదయం పేపర్ బాయ్గా పని చేస్తూ.. బీఎస్సీ నర్సింగ్ చదువుతున్నాడు. ఈ క్రమంలో ఈరోజు తెల్లవారుజామున ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 5, 2025
చేలో కూలీలతో కలిసి కలుపు తీసిన పల్నాడు జిల్లా కలెక్టర్

రాజుపాలెం(M) రాజుపాలెంలో బుధవారం జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా పర్యటించారు. సహజ సిద్ధంగా సాగు చేస్తున్న చామంతి, మిర్చి, బొప్పాయి తోటలను పరిశీలించారు. మిర్చి పంటలో జిల్లా కలెక్టర్ కూలీలతో కలిసి కలుపు తీసి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రకృతి విధానంలో పండిన కూరగాయలను పరిశీలించి రైతులకు సలహాలు ఇచ్చారు.
News November 5, 2025
ఏళ్లు గడుస్తున్నా ప్రారంభానికి నోచుకోని సాలూరు వంద పడకల ఆసుపత్రి.!

కోట్ల రుపాయలు వెచ్చించి నిర్మిస్తున్న సాలూరు వంద పడకల ఆసుపత్రి ఇంకా కొన్ని పనులు పెండింగ్ ఉండడంతో ప్రారంభంకు నోచుకోలేదు. వైద్య సేవలు అందించేందుకు సరిపడా సిబ్బంది ఉన్నా వసతుల లేమితో రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓపీ చూసేందుకు సరిపడా గదులు లేక ఐదుగురు డాక్టర్లు ఒకేచోట ఉండి సేవలు అందిస్తున్నామని సూపరింటెండెంట్ మీనాక్షి తెలిపారు. ఆసుపత్రి తొందరలో ప్రారంభం అయ్యేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.
News November 5, 2025
కరీంనగర్: అంజనాద్రి క్షేత్రంలో స్వామిపై సూర్యకిరణాలు

కరీంనగర్ పరిధి భగత్నగర్ గుట్టపై ఉన్న అంజనాద్రి క్షేత్రంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా అద్భుత దృశ్యం కనిపించింది. బుధవారం ఉదయం సూర్యోదయ సమయంలో సూర్యకిరణాలు స్వయంభు హనుమాన్ విగ్రహంపై నేరుగా పడి భక్తులను మంత్రముగ్ధులను చేశాయి. ఆలయ పూజారుల ప్రకారం ప్రతి ఏడాది ఈ పుణ్యదినాన ఇదే విధంగా సూర్యకాంతులు విగ్రహాన్ని తాకుతాయని తెలిపారు. ఇది దేవస్థాన నిర్మాణ శైలికి, ఆ స్థల పవిత్రతకు నిదర్శనమని వారు పేర్కొన్నారు.


