News March 28, 2025
BREAKING: మహబూబ్నగర్: విద్యార్థి ఆత్మహత్య

ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. పీర్ల గుట్ట సమీపంలో ఉండే మణిదీప్(18) ఉదయం పేపర్ బాయ్గా పని చేస్తూ.. బీఎస్సీ నర్సింగ్ చదువుతున్నాడు. ఈ క్రమంలో ఈరోజు తెల్లవారుజామున ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Similar News
News July 9, 2025
YCP నేత ప్రసన్నకుమార్ రెడ్డిపై కేసు నమోదు

AP: TDP MLA వేమిరెడ్డి ప్రశాంతిపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణల నేపథ్యంలో వైసీపీ నేత నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పలువురు మహిళల ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద ఆయనపై కోవూరు పీఎస్లో కేసులు నమోదయ్యాయి. త్వరలో ఆయనను పోలీసులు విచారించే అవకాశం ఉంది. కాగా ఈ విషయంపై పలు మహిళా సంఘాలు రాష్ట్ర మహిళా కమిషన్కు కూడా ఫిర్యాదు చేశాయి.
News July 9, 2025
శ్రీకాకుళం: 22 పీఏసీఎస్ సంఘాలకు ఛైర్మన్ల నియామకం

శ్రీకాకుళం జిల్లాలో 22 పీఏసీఎస్ (ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాలు)కు ఛైర్మన్లను నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు విడుదల చేసింది. జిల్లాలో 36 పీఏసీఎస్ సంఘాలు ఉండగా 22 పీఏసీఎస్ సంఘాలకు ఛైర్మన్ల నియామకం పూర్తయింది. వీరు వచ్చే ఏడాది జూలై 30వ తేదీ వరకు కొనసాగుతారు. ఒక పీఏసీఎస్ సంఘానికి ఛైర్మన్తో పాటు ఇద్దరు సభ్యులను నియమించారు.
News July 9, 2025
నష్టాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాలతో ప్రారంభమయ్యాయి. Sensex 46 పాయింట్ల లాభంతో 83,665 పాయింట్ల వద్ద,, Nifty 10 పాయింట్ల నష్టంతో 25,512 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. HCL టెక్, టాటా స్టీల్, విప్రో, ఇన్ఫోసిస్, JSW స్టీల్, ICICI, HDFC, టెక్ మహీంద్రా, డా.రెడ్డీస్ ల్యాబ్స్, అపోలో షేర్లు నష్టాల్లో, ఏషియన్ పెయింట్స్, ట్రెంట్, మారుతీ సుజుకీ, M&M, సిప్లా, రిలయన్స్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.