News February 11, 2025
BREAKING.. ములుగు: పురుగు మందు తాగి ఇద్దరు ఆత్మహత్య
ములుగు జిల్లాలో విషాదం నెలకొంది. కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెంలో పురుగు మందు తాగి ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. ఆలెం స్వామి, అశ్విత మృతి చెందారు. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణంగా తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 12, 2025
ADB వాసికి అంతర్జాతీయ అవార్డు
అంతర్జాతీయ చలనచిత్ర ఉత్సవాల్లో భాగంగా ఉత్తమ డిస్క్రిప్షన్ డైరెక్టర్గా ADBకు చెందిన ప్రముఖ సినీ డైరెక్టర్ ఫహీం సర్కార్ అవార్డు అందుకున్నారు. మంగళవారం HYDలో జరిగిన చలనచిత్ర ఉత్సవంలో భాగంగా సినిమా, టీవీ రంగాల్లో పలు విభాగాలలో అందించిన అంతర్జాతీయ అవార్డుల పురస్కారంలో భాగంగా బెస్ట్ డిస్క్రిప్షన్ డైరెక్టర్ డైరెక్టర్గా ఫహీం సర్కార్ అవార్డు అందుకున్నారు.
News February 12, 2025
సిద్దిపేట: టెన్త్ అర్హతతో పోస్టల్ శాఖలో ఉద్యోగాలు
ఇండియా పోస్టల్ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. సంగారెడ్డి డివిజన్లో 25 , మెదక్ డివిజన్లో 24 గ్రామీణ్ డాక్ సేవక్(GDS) పోస్టులు ఉన్నాయి. దీనికి టెన్త్ అర్హత, వయసు 18-40ఏళ్ల మధ్య ఉండాలి. సైకిల్ లేదా బైక్ నడిపగలగాలి. టెన్త్లో మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. జనరల్, OBC, EWS వారికి దరఖాస్తు ఫీజు రూ.100. మార్చి 3వరకు ఈ https://indiapostgdsonline.gov.in/ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
News February 12, 2025
రాహుల్ గాంధీకి కోర్టు సమన్లు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి లక్నో ప్రజాప్రతినిధుల కోర్టు తాజాగా సమన్లు జారీ చేసింది. భారత్ జోడో యాత్రలో ఆయన భారత సైన్యాన్ని అవమానపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ సరిహద్దు రోడ్ల సంస్థ మాజీ డైరెక్టర్ ఉదయ్ శంకర్ కేసు పెట్టారు. ఆ కేసు విచారణను స్వీకరించిన కోర్టు, వచ్చే నెల ఆఖరి వారంలో విచారణకు హాజరుకావాలని రాహుల్ని ఆదేశించింది.