News February 11, 2025

BREAKING.. ములుగు: పురుగు మందు తాగి ఇద్దరు ఆత్మహత్య

image

ములుగు జిల్లాలో విషాదం నెలకొంది. కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెంలో పురుగు మందు తాగి ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. ఆలెం స్వామి, అశ్విత మృతి చెందారు. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణంగా తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News November 25, 2025

సిరిసిల్ల: ఉరివేసుకొని మహిళ ఆత్మహత్య

image

సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లిలో మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. అందే నీరజ(27) మంగళవారం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కాగా, మృతురాలి భర్త దేవరాజ్ గల్ఫ్ దేశంలో ఉన్నాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరించారు. మృతురాలికి ఒక కుమారుడు ఉన్నాడు.

News November 25, 2025

బీఆర్ అంబేడ్కర్ బాలికల గురుకులం భవనం ప్రారంభం

image

బాపట్ల మండలం నరసాయపాలెంలో 1.10 కోట్ల రూపాయలతో నిర్మించిన బీఆర్ అంబేడ్కర్ బాలికల గురుకుల పాఠశాల భవనాన్ని ఎంపీ కృష్ణ ప్రసాద్, ఎమ్మెల్యే నరేంద్ర వర్మ ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం ఆంధ్రరాష్ట్ర అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో గ్లోరియా, ఎమ్మార్వో తదితర అధికారులు పాల్గొన్నారు.

News November 25, 2025

నిర్మల్: కలెక్టర్‌కు ఎస్పీ అభినందన

image

జలసంచాయ్–జనభాగీదారీ అవార్డును కలెక్టర్ అభిలాష అభినవ్ ఇటీవల న్యూఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సి.ఆర్. పాటిల్ చేతుల మీదుగా స్వీకరించారు. మంగళవారం కలెక్టరేట్‌ చాంబర్‌లో జిల్లా ఎస్పీ జానకి షర్మిల మర్యాదపూర్వకంగా కలెక్టర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ శ్రీ ఫైజాన్ అహ్మద్‌ను కూడా ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం కేక్‌ కట్‌ చేయించారు.