News February 11, 2025
BREAKING.. ములుగు: పురుగు మందు తాగి ఇద్దరు ఆత్మహత్య

ములుగు జిల్లాలో విషాదం నెలకొంది. కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెంలో పురుగు మందు తాగి ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. ఆలెం స్వామి, అశ్విత మృతి చెందారు. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణంగా తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 24, 2025
కామరెడ్డి: చెక్కులు ఇచ్చింది వీళ్లకే..!

విధి నిర్వహణలో రోడ్డు ప్రమాదాల్లో మరణించిన ఇద్దరు కానిస్టేబుళ్ల కుటుంబాలకు KMR ఎస్పీ రాజేష్ చంద్ర భరోసా కల్పించిన విషయం తెలిసిందే. గాంధారి PSకు చెందిన కానిస్టేబుల్ వడ్ల రవికుమార్, పిట్లం PSకు చెందిన కె. బుచ్చయ్య మృతిచెందారు. SBI పోలీస్ సాలరీ ప్యాకేజ్ స్కీమ్ కింద ఒక్కో కుటుంబానికి రూ.కోటి ఇన్సూరెన్స్ చెక్కులను SP అందజేశారు.
News November 24, 2025
KMR: ఆలయాలకు ‘ధూప దీప నైవేద్యం’

ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ చొరవతో, దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కామారెడ్డి జిల్లాలోని నాలుగు దేవాలయాలకు ‘ధూప దీప నైవేద్యం’ పథకాన్ని మంజూరు చేశారు. షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. చరిత్ర కలిగిన దేవాలయాలు నిర్వహణ లేక శిథిలమవుతున్నాయన్నారు. ఈ పథకం ద్వారా ఆలయాల్లో నిత్యం పూజలు జరిగేందుకు, అర్చకుల పోషణకు ప్రభుత్వం సహాయం అందిస్తుందని తెలిపారు. అర్చకుల ఖాతాలో నేరుగా జమ చేస్తామని చెప్పారు.
News November 24, 2025
ఐబొమ్మ రవిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే ఏమన్నారంటే?

TG: ఐబొమ్మ రవి రాబిన్హుడ్ హీరో అని ప్రజలు అనుకుంటున్నారని జడ్చర్ల MLA అనిరుధ్ అన్నారు. టికెట్ ధరలు పెంచి దోచుకోవడం తప్పనే భావనలో వారు ఉన్నారని తెలిపారు. ‘₹1000 కోట్లు పెట్టి తీస్తే బాగుపడేది హీరో, డైరెక్టర్, నిర్మాత అని, ₹50-100Cr పెట్టి తీయలేరా అని ప్రశ్నిస్తున్నారు. తప్పు చేసిన వ్యక్తిని శిక్షించాలని మరికొందరు అంటున్నారు. న్యాయస్థానం ఎలాంటి తీర్పు ఇస్తుందో వేచి చూడాలి’ అని చెప్పారు.


