News November 9, 2024
BREAKING: వనపర్తిలో ట్రాక్టర్ బోల్తా.. ఇద్దరు మృతి

ట్రాక్టర్ బోల్తా పడి ఇద్దరు కూలీలు మృతి చెందిన ఘటన వనపర్తిలోని సవాయిగూడెంలో చోటు చేసుకుంది. స్థానికులు వివరాలు.. సవాయిగూడెంలోని ఓ పొలంలో అదే గ్రామానికి చెందిన 20 మంది కూలీలు వ్యవసాయ పనులు పూర్తి చేసుకుని వస్తుండగా, చెరువు ముందరి తండా రోడ్డు వద్ద ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. కూలీలు గోపాలమ్మ(58), సానే పద్మమ్మ(59) మృతి చెందారు. ఆరుగురికి తీవ్ర గాయాలు కాగా, వారిని ప్రభుత్వ ఆసపత్రికి తరలించారు.
Similar News
News October 24, 2025
దేవరకద్రలో వ్యక్తి దారుణ హత్య

దేవరకద్ర మండలం అడవి అజిలాపూర్ గ్రామానికి చెందిన దానం మైబు(40) హత్యకు గురయ్యాడు. ఈ ఘటన శక్రవారం వెలుగు చూసింది. మైబు హమాలి పని ముగించుకొని గురువారం రాత్రి 9:30 గంటలకు బైక్ పై ఇంటికి వెళ్తుండగా అడవి అజిలాపూర్ గేటు సమీపంలో గుర్తుతెలియని దుండగులు దారుణంగా నరికి చంపారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు.
News October 24, 2025
పాలమూరు: టపాసులు పేలి విద్యార్థులకు గాయాలు

టపాసులు పేలి నలుగురు విద్యార్థులు గాయపడ్డారు. పాలమూరు రూరల్ రేగడిగడ్డ తాండ పంచాయతీ పరిధిలోని ప్రైమరి పాఠశాల విద్యార్థులు శుక్రవారం ఉదయం క్లాస్ బయట టపాసులు పేల్చారు. అవి పేలడంతో నలుగురు విద్యార్థులు గాయపడ్డారు. ఆ సమయంలో హెచ్ఎం, ఉపాధ్యాయులు పాఠశాలలో లేకపోవడంతో సిబ్బంది వారిని ఆసుపత్రికి తరలించారు.
News October 23, 2025
MBNR: నేర సమీక్ష.. కేసుల దర్యాప్తుపై ఎస్పీ దృష్టి

మహబూబ్నగర్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ డి.జానకి ఆధ్వర్యంలో నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో క్రైమ్ కేసుల దర్యాప్తు పురోగతి, పెండింగ్ కేసుల స్థితిపై ఆరా తీశారు. మహిళలు, బాలలపై నేరాలు, సైబర్ మోసాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. సామాజిక మాధ్యమాల ద్వారా జరుగుతున్న మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


