News March 6, 2025

BREAKING.. వరంగల్: కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా.. ఒకరు మృతి

image

వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం కోనాపూరం శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. మిర్చి కూలీలతో వెళ్తున్న వాహనం బోల్తాపడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. దాదాపు 20 మంది కూలీలకు గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. జీడిగట్టుతండా నుంచి ఇటుకలపల్లి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో ఆటోలో మొత్తం 35 మంది ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News December 1, 2025

WNP: అధికారులు పూర్తిగా అవగాహన కలిగి ఉండాలి

image

ఎన్నికల్లో ప్రిసైడింగ్‌ అధికారులు, సహాయ ప్రిసైడింగ్‌ అధికారుల పాత్ర కీలకమని, తమ విధులు,బాధ్యతలపై పూర్తి అవగాహన పెంచుకుని పోలింగ్‌ ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలని వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. సోమవారం మదనాపురం జెడ్పి బాయ్స్ హైస్కూల్ నిర్వహించిన ప్రిసైడింగ్ అధికారుల శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించారు. కలెక్టర్ మాట్లాడుతూ విధులపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు.

News December 1, 2025

పెద్దపల్లి: 35 కంప్యూటర్ల సరఫరాకు దరఖాస్తుల ఆహ్వానం

image

పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ పాఠశాలలకు 35 కంప్యూటర్ల సరఫరా కోసం ఆసక్తి గల సరఫరాదారులు డిసెంబర్ 4లోగా దరఖాస్తులు సమర్పించాలని ఇన్చార్జ్ డీఈఓ శారద తెలిపారు. దరఖాస్తులు జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో స్వీకరించబడతాయి. వివరాలకు సెక్టోరల్ అధికారి సి.హెచ్. మల్లేష్ గౌడ్‌ (ఫోన్: 9959262737) ను సంప్రదించవచ్చు.

News December 1, 2025

ఎన్నికలు శాంతియుతంగా జరిగేలా చూడాలి: ఎస్పీ నరసింహ

image

గ్రామ పంచాయతీ ఎన్నికలు శాంతియుతంగా జరిగేలా చూడాలని, సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎస్పీ నరసింహ అధికారులను ఆదేశించారు. పెన్ పహాడ్ మండల కేంద్రంలో నామినేషన్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. నామినేషన్ కేంద్రాల వద్ద శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే, ఎన్నికల నియమావళి ప్రకారం కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు.