News March 6, 2025

BREAKING.. వరంగల్: కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా.. ఒకరు మృతి

image

వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం కోనాపూరం శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. మిర్చి కూలీలతో వెళ్తున్న వాహనం బోల్తాపడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. దాదాపు 20 మంది కూలీలకు గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. జీడిగట్టుతండా నుంచి ఇటుకలపల్లి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో ఆటోలో మొత్తం 35 మంది ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News January 16, 2026

ట్రంప్ కొంతైనా ‘శాంతి’స్తారా?

image

అధికారికంగా కాకపోయినా ట్రంప్‌ చేతికి <<18868941>>నోబెల్ పీస్ ప్రైజ్<<>> అందింది. దీంతో కొంతైనా శాంతించి ఉంటారని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఇప్పుడు మచాడో వెనిజులా అధ్యక్షురాలు అవుతారని కొందరు, ఆమెకు ఇచ్చిన బహుమతిని వెనక్కి తీసుకోవాలని మరికొందరు స్పందిస్తున్నారు. కాగా తనకు కాకుండా వెనిజులాకు చెందిన వ్యక్తికి నోబెల్ ప్రైజ్ రావడంతోనే ఆ దేశంపై దాడి చేసి అధ్యక్షుడిని అరెస్ట్ చేశారని ట్రంప్‌పై తీవ్ర విమర్శలొచ్చాయి.

News January 16, 2026

ఆసిఫాబాద్: గురుకుల ప్రవేశ పరీక్ష ప్రకటన విడుదల

image

2026-27 విద్యా సంవత్సరానికి గాను రాష్ట్రంలోని వివిధ గురుకుల పాఠశాలల్లో (5, 6-9 తరగతులు) ప్రవేశాలకు ఉమ్మడి ప్రకటన విడుదలైంది. ఆసక్తి గల విద్యార్థులు డిసెంబర్ 11 నుంచి జనవరి 21 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు ఆధార్, బోనఫైడ్, కుల, ఆదాయ పత్రాలు అవసరం. ఈ అవకాశాన్ని కొమురం భీం జిల్లా విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.

News January 16, 2026

ముంబై పీఠం ఎవరిది.. నేడే కౌంటింగ్

image

ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌ (BMC) ఎన్నికల ఫలితాలు నేడు 10am నుంచి వెలువడనున్నాయి. మొత్తం 227 వార్డులకు జరిగిన ఎన్నికల్లో సుమారు 46-50% పోలింగ్ నమోదైనట్లు EC తెలిపింది. BJP నేతృత్వంలోని మహాయుతి కూటమి విజయం సాధిస్తుందని <<18867305>>ఎగ్జిట్ పోల్స్<<>> అంచనా వేశాయి. ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో కౌంటింగ్‌పై ఉత్కంఠ నెలకొంది. మేయర్ పీఠం కైవసం చేసుకోవడానికి 114 స్థానాల్లో విజయం సాధించాల్సి ఉంటుంది.