News November 22, 2024

BREAKING.. వాజేడు : అన్నదమ్ములను హతమార్చిన మావోలు

image

ములుగు జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. పోలీస్ ఇన్‌ఫార్మర్లనే నెపంతో అన్నదమ్ములను కత్తులతో పొడిచి హతమార్చారు. ఈ ఘటన వాజేడు మండలం జంగాలపల్లిలో జరిగింది. మృతులు ఊక అర్జున్, రమేశ్‌గా గుర్తించారు. రమేశ్ పంచాయతీ సెక్రటరీగా పని చేస్తున్నట్లు సమాచారం. కాగా, వాజేడు మావోయిస్టు కమిటీ శాంత పేరిట మావోలు లేఖ వదిలారు.

Similar News

News December 21, 2025

రేపు వరదలు, ప్రమాదాలపై మాక్ డ్రిల్

image

వరదలు, పరిశ్రమల ప్రమాదాలు జరిగినప్పుడు ఎదుర్కోవాల్సిన తీరుపై అవగాహన కల్పించేందుకు సోమవారం ఖమ్మం నయాబజార్లోని ZPSS, జనరల్ ఆస్పత్రిలో మాక్ డ్రిల్ నిర్వహించనున్నట్లు ఖమ్మం కలెక్టర్ అనుదీప్ తెలిపారు. మాక్ డ్రిల్ జరగనున్నందున ప్రజలు హాజరయ్యేలా ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. ఇందులో 50 మంది చొప్పున ఆపద మిత్ర వలంటీర్లు, 20 మంది NCC కేడెట్లు పాల్గొంటారని తెలిపారు.

News December 21, 2025

అడవి మంటలపై అప్రమత్తంగా ఉండాలి: అటవీ శాఖ

image

ఖమ్మం జిల్లాలో అడవి మంటల నివారణకు ప్రజలు పూర్తిస్థాయిలో సహకరించాలని అటవీ శాఖ కోరింది. అటవీ ప్రాంతాల్లో సిగరెట్లు తాగడం, వంటల కోసం నిప్పు రాజేయడం వంటి పనులు చేయరాదని హెచ్చరించింది. “అడవిని రక్షిస్తేనే – భవిష్యత్తు ఉంటుంది” అని పేర్కొంటూ, ఎక్కడైనా అగ్ని ప్రమాదాలు కనిపిస్తే వెంటనే 87422 95323 లేదా టోల్ ఫ్రీ 18001 19334 నంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరింది.

News December 21, 2025

రేపటి నుంచి యథావిధిగా ప్రజావాణి: ఖమ్మం కలెక్టర్

image

ప్రతి సోమవారం కలెక్టరేట్లో చేపట్టే ప్రజావాణి కార్యక్రమాన్ని తిరిగి యథావిధిగా సోమవారం(DEC 22) నుంచి నిర్వహించనున్నట్లు కలెక్టర్ అనుదీప్ తెలిపారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలుపుదల చేసినట్లు చెప్పారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి, తమ అర్జీలను కలెక్టరేట్లో సమర్పించి, ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు.