News April 8, 2025
BREAKING..శామీర్పేట్లో ఘోర రోడ్డు ప్రమాదం

శామీర్పేట్లోని జీనోమ్ వ్యాలీ PS పరిధిలో లాల్గడి మలక్పేట్ హైవేపై సఫారీ కారు డీసీఎం ఢీ కొన్నాయి. సఫారీ వాహనం సిద్దిపేట నుంచి నగరానికి వస్తుండగా డివైడర్కు తగిలి ఎదురుగా వస్తున్న డీసీఎంను ఢీ కొట్టింది. దీంతో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు. ఏడుగురికి గాయాలయ్యాయి. మృతులు సిద్దిపేట జిల్లా వర్గల్కు చెందిన రాజు, తుర్కపల్లి పరిధి మురహరిపల్లికి చెందిన శ్రవణ్లుగా పోలీసులు గుర్తించారు.
Similar News
News January 7, 2026
సంగారెడ్డి: అల్పాహారం నిధులు విడుదల

పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతుల వేళ అల్పాహారం అందించేందుకు ప్రభుత్వం నిధులు విడుదల చేసిందని సంగారెడ్డి డీఈఓ తెలిపారు. ఫిబ్రవరి 16 నుంచి మార్చి 10 వరకు అల్పాహారం అందించాలని, ఇందుకోసం జిల్లాకు రూ. 26,14,590 మంజూరైనట్లు పేర్కొన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.
News January 7, 2026
NPCILలో 114 పోస్టులకు షార్ట్ నోటిఫికేషన్

న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCIL) 114 పోస్టుల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. సైంటిఫిక్ అసిస్టెంట్, స్టైపెండరీ ట్రైనీ/సైంటిఫిక్ అసిస్టెంట్, స్టైపెండరీ ట్రైనీ/టెక్నీషియన్, X-RAY టెక్నీషియన్, అసిస్టెంట్ గ్రేడ్-1 పోస్టులు ఉన్నాయి. అర్హతగల వారు JAN 15 నుంచి ఫిబ్రవరి 4 వరకు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. www.npcilcareers.co.in
News January 7, 2026
విద్యార్థి వీసాలపై అమెరికా తీవ్ర హెచ్చరికలు

విద్యార్థి వీసాలపై ఇండియాలోని అమెరికా ఎంబసీ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ‘స్టూడెంట్ వీసాదారులు US చట్టాలను ఉల్లంఘిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు. చట్టాలను ఉల్లంఘించారని తేలినా, అరెస్టయినా వీసా రద్దవుతుంది. US నుంచి బహిష్కరిస్తారు. భవిష్యత్తులో వీసాలకు మీరు అనర్హులుగా మారవచ్చు. రూల్స్ పాటించండి. మీ ట్రావెల్ను ప్రమాదంలో పడేయకండి. US వీసా ఒక ప్రత్యేక ప్రయోజనం.. హక్కు కాదు’ అని ట్వీట్ చేసింది.


