News July 30, 2024

BREAKING: శ్రీకాకుళం జిల్లాలో యువతీ, యువకుడి మృతి

image

శ్రీకాకుళం జిల్లా పైడి భీమవరం జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పలాస మండలం గొప్పిలి ప్రాంతానికి చెందిన యువతీ, యువకుడు మృతిచెందారు. జాతీయ రహదారి ఫ్లై ఓవర్ వద్ద బైక్ అదుపుతప్పడంతో రోడ్డుపై పడి యువతి మృతిచెందగా.. ఫ్లై ఓవర్ పైనుంచి కిందపడి యువకుడు దుర్మరణం చెందాడు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News December 1, 2025

పలాస: యాక్సిడెంట్.. యువకుడుకి తీవ్ర గాయాలు

image

పలాస మండలం సున్నాడ గ్రామ జంక్షన్ సమీప రహదారిపై ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. సైకిల్‌పై వెళ్తున్న ఓ వ్యక్తిని ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తీసుకువెళ్లారు.

News December 1, 2025

శ్రీకాకుళం: ‘దిత్వా తుఫాను పట్ల అప్రమత్తంగా ఉండాలి’

image

దిత్వా తుఫాన్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సూచించారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. తుఫాను ప్రభావంతో సోమవారం నుంచి భారీ ఏపీకి వర్ష సూచన ఉందని తెలిపారు. ప్రధానంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని, స్థానిక వ్యవసాయ అధికారులు, రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకుని తమ పంటలను కాపాడుకోవాలని కోరారు.

News December 1, 2025

శ్రీకాకుళం: రహదారి భద్రతను మెరుగుపరచడంపై చర్యలు

image

జిల్లాలో రహదారి భద్రతను మెరుగుపరచడం, ప్రమాదాలను తగ్గించడం, ప్రజలకు ఇబ్బంది కలిగించే బహిరంగ మద్యం తాగడం, పబ్లిక్ న్యూసెన్స్‌పై ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు ఎస్పీ మహేశ్వర రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో 17,509 పైగా డ్రంకన్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్ కేసులు నమోదు కాగా.. వీటిలో 8,594 వేలకి పైగా కేసులు కోర్టుల ద్వారా శిక్షలు, జరిమానాల రూపంలో డిస్పోజ్ అయ్యాయని ఎస్పీ చెప్పారు.