News March 25, 2025
BREAKING: సూర్యాపేట జిల్లాలో ఘోర ప్రమాదం

సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలంలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. మండల పరిధిలోని శాంతినగర్ వద్ద ఆగి ఉన్న లారీని ఇన్నోవా కారు ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదానికి సంబంధిచిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News October 17, 2025
ONGCలో 2,623 అప్రెంటీస్ ఖాళీలు

ఆయిల్ అండ్ నాచురల్ గ్యాస్ కార్పొరేషన్(ONGC)లో 2,623 అప్రెంటీస్ ఖాళీలకు నోటిఫికేషన్ వెలువడింది. పోస్టును బట్టి టెన్త్, డిప్లొమా, ఐటీఐ, డిగ్రీ పాసైన వారు అర్హులు. వయసు 18-24 ఏళ్లు ఉండాలి. రిజర్వేషన్ను బట్టి సడలింపు ఉంటుంది. దరఖాస్తుకు చివరి తేదీ నవంబర్ 6. విద్యార్హతల్లో మెరిట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
వెబ్సైట్: <
News October 17, 2025
ఒకే స్కూల్లో అక్క–తమ్ముడు టీచర్లు!

నంద్యాల జిల్లా ఆత్మకూరుకు చెందిన బాల స్వామి–నాగమణి దంపతుల కుమార్తె సారా పింకీ, కుమారుడు శామ్యూల్ మెగా డీఎస్సీ-2025లో టీచర్లుగా ఎంపికయ్యారు. వీరిద్దరికీ తుగ్గలి మండల హుసేనాపురం ఉర్దూ పాఠశాలలోనే పోస్టింగ్ రావడం విశేషం. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఈ స్థాయికి చేరుకున్నామని, విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని వారు తెలిపారు.
News October 17, 2025
బీజేపీ, బీఆర్ఎస్కు బీసీల పట్ల ప్రేమ లేదు: పెద్దపల్లి ఎమ్మెల్యే

ఈనెల 18న బీసీ జేఏసీ తలపెట్టిన రాష్ట్రవ్యాప్త బంద్కు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు పేర్కొన్నారు. కాల్వశ్రీరాంపూర్ మండలం పెగడపల్లిలో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. బీసీలకు రిజర్వేషన్లు పెంచాలని కాంగ్రెస్ మొదటినుంచి నినదిస్తోందని తెలిపారు. బీసీ కుల గణన నిర్వహించిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికే దక్కుతుందని చెప్పారు. బీజేపీ, బీఆర్ఎస్ కు బీసీల పట్ల ప్రేమ లేదన్నారు.