News February 13, 2026
BREAKING: హజూర్నగర్ మున్సిపల్ పీఠం కాంగ్రెస్దే

హుజూర్నగర్ మున్సిపాలిటీ పీఠం కాంగ్రెస్ గెలిచింది. మున్సిపాలిటీలో 28 వార్డులకు గాను 19 వార్డులు కాంగ్రెస్ సాధించింది. 4 వార్డులు BRS అభ్యర్థులు గెలిచారు. మిగితా వాటిల్లో ఇతరులు గెలిచారు. మ్యాజిక్ ఫిగర్ దాటడంతో కాంగ్రెస్ పీఠం దక్కించుకుంది. దీంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.
Similar News
News March 13, 2026
ఎక్కువ రేట్లకు సిలిండర్లు అమ్ముతున్నారా.. కాల్ చేయండి.!

గ్యాస్ సిలిండర్లపై అసత్య వార్తలు ప్రచారాలు చేస్తే చర్యలు తప్పవని ఎస్పీ తుషార్ డూడీ హెచ్చరించారు. సిలిండర్ల కొరత, ధరలు పెరిగాయని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. బ్లాక్ మార్కెటింగ్ చేసే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. అధిక ధరకు సిలిండర్లు విక్రయిస్తే 112 సమాచారం ఇవ్వాలన్నారు. ప్రజలు అధికారిక సమాచారాన్ని విశ్వసించాలన్నారు.
News March 13, 2026
MNCL: ప్రభుత్వ ఉద్యోగం రాలేదని యువకుడి ఆత్మహత్య

ప్రభుత్వ ఉద్యోగం రాలేదని మనస్తాపంతో ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. దేవాపూర్ ఎస్సై గంగారాం కథనం ప్రకారం.. కాసిపేట మండలం లంబాడితండా(డి)కు చెందిన హరీశ్(28) డిప్లొమా పూర్తి చేసి, ఇంజినీరింగ్ మధ్యలో ఆపేసి ప్రైవేట్ ఉద్యోగం చేస్తూనే డిగ్రీ పూర్తి చేశాడు. పలు ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీ పడినా ఫలితం దక్కలేదు. ప్రైవేట్ కొలువు చేయలేక, ఒత్తిడికి లోనైన యువకుడు సూసైడ్ నోటు రాసి ఇంట్లో ఉరేసుకున్నాడు.
News March 13, 2026
భద్రాచలం: శ్రీరామ నవమి.. 400కు పైగా SPL. బస్సులు

భద్రాచలం శ్రీరామ నవమి వేడుకలకు TGSRTC, APSRTCలు భారీ ఏర్పాట్లు చేశాయి. ఖమ్మం రీజియన్ నుంచి 234, ఏపీ నుంచి 172 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్ఎం సరిరామ్ తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా విజయవాడ, హైదరాబాద్లకు అదనపు సర్వీసులను కేటాయించారు. భద్రాచలం జూనియర్ కళాశాల నుంచి ఆలయం వరకు భక్తులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించనున్నారు.


