News February 26, 2026

BREAKING: అర్ధరాత్రి ఆసిఫాబాద్ జిల్లాలో భూ ప్రకంపనలు

image

ఆసిఫాబాద్ జిల్లాలోని చింతలమానేపల్లి, బెజ్జూర్ తదితర మండలాల్లో బుధవారం అర్ధరాత్రి 11:50 గంటల సమయంలో స్వల్పంగా భూమి కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఇంట్లోని వస్తువులు కదిలినట్లు స్థానికులు పేర్కొన్నారు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని తెలుస్తోంది.

Similar News

News February 26, 2026

బాపట్ల: 40 బైకులు, 4 లీటర్ల నాటుసారా స్వాధీనం- ఎస్పీ

image

జిల్లాలో గురువారం కార్డెన్ సెర్చ్ నిర్వహించి 40 బైకులు, 4 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ ఉమామహేశ్వర్ చెప్పారు. బాపట్ల డీఎస్పీ జగదీష్ నాయక్ ఆధ్వర్యంలో బాపట్ల సబ్ డివిజన్ పరిధిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించామన్నారు. జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడమే లక్ష్యంగా కార్డెన్ సర్చ్ నిర్వహించినట్లు తెలిపారు.

News February 26, 2026

డ్రైవింగ్ లైసెన్స్ విధానంలో మార్పులు..!

image

రోడ్డు ప్రమాదాల నియంత్రణకు గ్రేడ్ ఆధారిత డ్రైవింగ్ లైసెన్స్ విధానం ప్రవేశపెట్టాలని కేంద్రం ప్లాన్ చేస్తోంది. ‘అతివేగం, డ్రంకెన్ డ్రైవ్ వంటి కారణాలతో ఏటా 1.8L మంది చనిపోతున్నారు. అందుకే త్వరలో కొత్త విధానం తెస్తాం. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే పాయింట్ల కోత పడుతుంది. అన్ని పాయింట్లు కోల్పోతే లైసెన్స్‌ను 6నెలలు సస్పెండ్ చేస్తాం. రిపీట్ చేస్తే లైసెన్స్‌ రద్దు చేస్తాం’ అని కేంద్రమంత్రి గడ్కరీ తెలిపారు.

News February 26, 2026

మాస్టర్ ప్లాన్ 2050.. ‘ఇన్ సైడర్ ట్రేడింగ్’ ముసుగులో భూదందా!

image

HMDA సిద్ధం చేస్తున్న ‘విజన్ 2050’ మాస్టర్ ప్లాన్ ఇంకా నోటిఫై కాకముందే దానిలోని ‘గ్రీన్ జోన్’, ‘రెసిడెన్షియల్ జోన్’ వివరాలు లీక్ అయ్యాయి. ఏయే ప్రాంతాలు భవిష్యత్తులో పారిశ్రామిక హబ్‌లుగా మారుతాయో ముందే తెలుసుకున్న కొందరు అధికారులు, రాజకీయ నేతలు కలిసి చుట్టుపక్కల వేల ఎకరాలను కారుచౌకగా కొనుగోలు చేశారు. ఈ ‘ఇన్ సైడర్ ట్రేడింగ్’ విలువ దాదాపు ₹5,000 కోట్లకు పైమాటే.