News December 16, 2025

BREAKING: కామారెడ్డి జిల్లాలో విషాదం

image

కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలం జంగంపల్లి గ్రామానికి చెందిన జంగం మహేశ్వరి(30) అనే వివాహిత మంగళవారం తన ఇంట్లో ఉరేసుకుని చనిపోయిందని కుటుంబసభ్యులు, గ్రామస్థులు తెలిపారు. సీఏగా విధులు నిర్వహిస్తున్న మహేశ్వరి మధ్యాహ్నం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందన్నారు. కాగా ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఎస్ఐ ఆంజనేయులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి, వివరాలు సేకరించారు.

Similar News

News December 18, 2025

NZB: BJP సర్పంచ్‌లు ఎంతమంది గెలిచారంటే!

image

నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో మూడు దశల్లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 84 మంది సర్పంచులు BJP తరఫున గెలుపొందారు. పార్లమెంట్ పరిధిలోని నిజామాబాద్, జగిత్యాల జిల్లాల పరిధిలోని 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 34 మండలాలు, 642 గ్రామ పంచాయతీల్లో BJP మద్దతుదారులు 299 GPల్లో పోటీ చేసి 84 గ్రామ పంచాయతీల్లో గెలిచారు. ఎంపీ అర్వింద్ తమకు అండదండలు ఇవ్వడంతో పాటు గ్రామస్థులు మద్దతు పలికారని గెలిచిన వారన్నారు.

News December 18, 2025

కడప జిల్లాలో అస్థి పన్ను డిమాండ్ ఎన్ని కోట్లంటే..

image

కడప జిల్లాలో 8 మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటి పరిధిలో ఈ ఆర్థిక సంవత్సరంలో అస్థి పన్ను బకాయిలు రూ.162.81 కోట్లు ఉన్నాయి. ఇందులో ఇప్పటివరకు రూ.64.78 కోట్లు (64.78%) మాత్రమే వసూలైంది. రూ. కోట్లల్లో KDP-100.80 గాను 37.65, PDTR-35.33గాను 13.17, PVLD-8.65 గాను 5.67, JMD-4 గాను 2.62, BDVL-2.73 గాను 2.11, YGL-5.01 గాను 1.87, MYDKR-5.17 గాను 1.36, KMLPRM-1.13 గాను 0.33 కోట్లు మాత్రమే వసూలైంది.

News December 18, 2025

నెల్లూరు కలెక్టర్ బాగా పనిచేస్తున్నారు: CM

image

నెల్లూరు జిల్లాలో ‘ఛాంపియన్ రైతు’కు కలెక్టర్ హిమాన్షు శుక్లా శ్రీకారం చుట్టారు. ప్రతి గ్రామంలోనూ ఓ ఛాంపియన్ ఫార్మర్‌ను ఎంపిక చేసి మిగతా వారికి వ్యవసాయంపై అవగాహన కల్పించారు. దీంతో కలెక్టర్‌ను CM చంద్రబాబు ప్రశంసించారు. ‘అమరావతిలోనే ఉండాలని హిమాన్షును కోరా. ఓ జిల్లాలో ఇంపాక్ట్ కలిగిస్తానని కలెక్టర్‌గా వెళ్లారు. చక్కగా పనిచేస్తున్నారు. ఇతర కలెక్టర్లు హిమాన్షును ఆదర్శంగా తీసుకోవాలి’ అని CM సూచించారు.