News November 27, 2025
BREAKING.. కాళోజీ ఎగ్జామినేషన్ గది సీజ్!

డబ్బులు తీసుకొని <<18400179>>మార్కులు కలిపిన<<>> ఉదంతంపై చర్యలు చేపట్టారు. వరంగల్ ఎమ్మార్వో శ్రీకాంత్ ఆధ్వర్యంలో కేఎంసీ ప్రిన్సిపల్ సంధ్యా ఎగ్జామినేషన్ బ్రాంచ్ గదిని, కంప్యూటర్లను, స్కానర్లను సీజ్ చేశారు. నలుగురు పీజీ విద్యార్థుల రీకౌంటింగ్లో మార్కులు కలపాలని ఆరోపణలు రావడంతో ప్రభుత్వం సీరియస్గా విచారణ చేపట్టింది.
Similar News
News November 27, 2025
Te-Poll యాప్ను డౌన్లోడ్ చేసుకోండి: వరంగల్ కలెక్టర్

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లకు పూర్తి సమాచారాన్ని వేగంగా, సులభంగా అందించేందుకు రూపొందించిన Te-Poll మొబైల్ యాప్ ఇప్పుడు గూగుల్ ప్లేస్టోర్లో అందుబాటులో ఉందని జిల్లా కలెక్టర్ డా.సత్యశారద తెలిపారు. ఓటర్లు తమ పోలింగ్ కేంద్రం వివరాలు, ఓటర్ స్లిప్ నమోదు స్థితి వంటి కీలక సమాచారాన్ని ఒకే యాప్ ద్వారా తెలుసుకునే విధంగా ప్రత్యేకంగా తీర్చిదిద్దిన యాప్ ఇది అని పేర్కొన్నారు.
News November 27, 2025
HYD: ‘మహిళలు ధైర్యంగా ఫిర్యాదు చేయండి’

మహిళల భద్రతే తమ లక్ష్యమని రాచకొండ సీపీ సుధీర్ బాబు అన్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో 15 రోజుల్లో మహిళలను వేధించిన 110 మంది వ్యక్తులను పట్టుకున్నామన్నారు. మహిళలకు ఎవరు ఇబ్బంది కలిగించినా నిర్భయంగా ఫిర్యాదు చేయాలని, వేధింపులకు పాల్పడిన వారిని ఆధారాలతో కోర్టుకు హాజరు పరుస్తూ.. తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇస్తున్నామన్నారు.
News November 27, 2025
NRPT: నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత

ఎన్నికల నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ డా.వినీత్ తెలిపారు. కేంద్రాల చుట్టూ 100 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని ఆయన గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నామినేషన్ల ప్రక్రియను శాంతియుతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని ఎస్పీ చెప్పారు.


