News February 20, 2025
BREAKING: కొత్తగూడెం: లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరికాడు!

ఏసీబీ వలలో మరో అవినీతి అధికారి పట్టుబడ్డ ఘటన భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో గురువారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. మండల వ్యవసాయ శాఖ అధికారి సాయి శంతన్ కుమార్ రైతుకు పత్తి అమ్ముకునేందుకు కూపన్ ఇవ్వడానికి రూ.30 వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధిత రైతు ఏసీబీని ఆశ్రయించడంతో సాయి శాంతన్ కుమార్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ వై.రమేశ్ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
Similar News
News February 28, 2026
నరసాపురంలో పెన్షన్ పంపిణీ చేసిన కలెక్టర్

నరసాపురంలోని బొండమ్మ మహిళా వృద్ధాశ్రమంలో శనివారం కలెక్టర్ నాగరాణి ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు. లబ్ధిదారులను ఆప్యాయంగా పలకరించి, వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. జిల్లావ్యాప్తంగా 24 రకాల పింఛన్లకు సంబంధించి 2,22,980 మంది లబ్ధిదారులకు రూ.96.39 కోట్లను పంపిణీ చేస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. పింఛన్లతో పాటు వృద్ధులకు పండ్లను పంపిణీ చేసి వారికి భరోసానిచ్చారు.
News February 28, 2026
VIRAL: 5.9 కిలోల బుజ్జి బాహుబలి

న్యూయార్క్లోని ఓ జంట బాల భీముడికి జన్మనిచ్చింది. ఇతాకాలోని కాయుగా మెడికల్ సెంటర్లో టెర్రికా, షాన్ దంపతులకు ఏకంగా 5.9 కిలోల బరువున్న బాబు పుట్టాడు. ఈ బుజ్జి భీముడికి 6 నెలల పిల్లల దుస్తులు, డైపర్లే సరిపోతున్నాయి. అదే సమయంలో ఆస్పత్రిలో పుట్టిన మరో శిశువు 1.8కేజీలే ఉంది. ఇద్దరినీ పక్కపక్కనే ఉంచి తీసిన ఫొటో నెట్టింట వైరలవుతోంది. అయితే 1955లో ఇటలీలో 9.97kgలతో అత్యంత బరువైన శిశువు జన్మించింది.
News February 28, 2026
మెట్రో రైల్ రికార్డు.. 80 కోట్ల ప్రయాణాలు పూర్తి

హైదరాబాద్ మెట్రో రైలు మరో మైలు రాయిని చేరుకుంది. నగరవాసులకు గమ్యాన్ని సుగమం చేసిన మెట్రో రైలు ప్రారంభం నుంచి ఇప్పటివరకు 80 కోట్ల ప్రయాణాలు పూర్తి చేసింది. 2017 నవంబర్లో ప్రారంభమైన ఈ సేవలు రోజు రోజుకీ నగర ప్రజల ఆదరణ పొందుతుంది. ప్రతిరోజూ 4.1 నుంచి 4.5 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణిస్తూ ప్రతి నెలా 1.2 కోట్లకు పైగా ప్రయాణికులు మెట్రోను వినియోగిస్తున్నారు.


