News February 20, 2025

BREAKING: కొత్తగూడెం: లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికాడు! 

image

ఏసీబీ వలలో మరో అవినీతి అధికారి పట్టుబడ్డ ఘటన భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో గురువారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. మండల వ్యవసాయ శాఖ అధికారి సాయి శంతన్ కుమార్ రైతుకు పత్తి అమ్ముకునేందుకు కూపన్ ఇవ్వడానికి రూ.30 వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధిత రైతు ఏసీబీని ఆశ్రయించడంతో సాయి శాంతన్ కుమార్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ వై.రమేశ్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

Similar News

News November 8, 2025

న్యూస్ రౌండప్

image

▶ బీజేపీ కురువృద్ధుడు ఎల్‌కే అద్వానీని కలిసిన PM మోదీ. అద్వానీ పుట్టినరోజు సందర్భంగా విషెస్
▶ USలో అనారోగ్యంతో APలోని కారంచేడుకు చెందిన విద్యార్థిని రాజ్యలక్ష్మి(23) మృతి
▶ UPA హయాంలో 88వేల మంది అక్రమ వలసదారులను తిప్పి పంపామన్న కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్
▶ బిహార్ ఎన్నికల వేళ అన్నదమ్ములు తేజస్వీ యాదవ్‌, తేజ్ ప్రతాప్ మధ్య ముదిరిన వైరం.. సోదరుడితో ఇక ఎన్నటికీ బంధం ఉండదన్న తేజ్ ప్రతాప్

News November 8, 2025

ఎర్రచందనం దుంగలు పట్టుబడితే ఇలా చేస్తారు..!

image

ఎర్రచందనం దుంగలు ఎక్కడ పట్టుబడిన ఏపీకి అప్పగించేలా కేంద్రం నుంచి ప్రత్యేక జీవో తెచ్చారు. దుంగలు పట్టుబడిన వెంటనే వాటికి జీయో ట్యాగింగ్‌తో పాటు బార్ కోడ్‌ను ఏర్పాటు చేస్తారు. దీని ద్వారా ఎన్ని దుంగలు ఉన్నాయి, వాటి గ్రేడింగ్ ఏమిటి అనే వివరాలు డిజిటలైజేషనే చేయనున్నారు. త్వరలో ఇందుకు సంబంధించి చర్యలు తీసుకోనున్నారు.

News November 8, 2025

త్వరలోనే మహిళలకు రూ.2,500: జగ్గారెడ్డి

image

TG: వృద్ధులకు రూ.4వేల పెన్షన్, మహిళలకు రూ.2,500 సాయం అందించే పథకాలు త్వరలోనే అమలు అవుతాయని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి తెలిపారు. ఇందుకు త్వరలోనే ముహూర్తం ఖరారు అవుతుందన్నారు. ఈ స్కీముల అమలుకు సీఎం రేవంత్ ఆలోచన చేస్తున్నారని, నిధులు సమకూర్చుకునే పనిలో ఉన్నారని చెప్పారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో తమ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను గెలిపించాలని మీడియా సమావేశంలో ఓటర్లకు పిలుపునిచ్చారు.