News July 10, 2025
BREAKING: కోరుట్లలో యువకుడు సూసైడ్

ఓ యువకుడు సూసైడ్ చేసుకున్న ఘటన కోరుట్ల పట్టణంలోని ఆనంద నగర్లో ఈరోజు జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. యువకుడు తోకల శివ(19) ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Similar News
News July 11, 2025
తెలుగు రాష్ట్రాల న్యూస్ రౌండప్

* AP: ప్రపంచ జనాభా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్న CM చంద్రబాబు
* రాష్ట్రంలో లక్ష సీసీ కెమెరాలు ఏర్పాటు: హోంమంత్రి అనిత
* శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం
* TG: మెడికల్ కాలేజీల్లో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీ.. దరఖాస్తు తేదీ(ఈ నెల 20-27 వరకు) మార్పు
* కూకట్పల్లి కల్తీ కల్లు ఘటనలో ఏడుకు చేరిన మరణాలు
* కాళేశ్వరం అక్రమాలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందుకు మరోసారి హరీశ్ రావు
News July 11, 2025
ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో ఎంపీలకు 40% కోటా ఇవ్వాలి: రఘునందన్

సీఎం రేవంత్ రెడ్డికి మెదక్ ఎంపీ రఘునందన్ రావు బహిరంగ లేఖ రాశారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారుల ఎంపికలో ఎంపీలకు 40% కోటా కేటాయించాలని లేఖలో డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేల లాగానే ఎంపీలు కూడా ప్రజలచే ఎంపికైన ప్రజాప్రతినిధులేనని, వారికి కూడా లబ్ధిదారుల ఎంపికలో సమాన ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. సీఎం గతంలో ఎంపీగా చేశారు కాబట్టి, ఎంపీల ప్రాధాన్యత గురించి ఆయనకు తెలుసునని లేఖలో పేర్కొన్నారు.
News July 11, 2025
‘బడి పండగ’పై మీ కామెంట్..

కొత్తచెరువు ZPHSలో జరిగిన ‘మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్’ విజయవంతమైంది. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ నేరుగా విద్యార్థులు, తల్లిదండ్రులతో ముచ్చటించడంతో పిల్లల్లో ఉత్సాహం నెలకొంది. సీఎం టీచర్గా మారి పాఠాలు చెప్పడం, లోకేశ్ పిల్లలతో కలిసి పాఠాలు వినడం, మాధవి అనే మహిళ నలుగురు పిల్లల ఉన్నత చదువు బాధ్యతలు తీసుకోవడం ఈ పర్యటనలో హైలైట్. ఎలాంటి పొలిటికల్ టచ్ లేకుండా జరిగిన ఈ కార్యక్రమంపై మీ కామెంట్..