News August 24, 2025
BREAKING: ఖమ్మం: భార్యను కత్తితో పొడిచిన భర్త

భార్యపై అనుమానంతో భర్త కత్తితో దాడికి పాల్పడిన ఘటన మధిర రూరల్ మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలిలా.. మధిర మండలం మాటూరుకు చెందిన సూర్యనారాయణ(30) తన భార్య సాయి నాగలక్ష్మి (26)పై అనుమానంతో కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో నాగలక్ష్మికి గాయాలు కాగా కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. ఘటనపై మధిర పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News August 24, 2025
కర్నూలు: ఈనెల 29న సరిహద్దుల మార్పు కోసం విజ్ఞప్తుల స్వీకరణ

ఉమ్మడి జిల్లాకు సంబంధించి కర్నూలు సునయన ఆడిటోరియంలో 29న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మండల, గ్రామాల పేర్లు, సరిహద్దుల మార్పు కోసం అభ్యర్థనలు స్వీకరించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు.. జిల్లా, మండల, గ్రామాల పేర్లు, అలాగే వాటి సరిహద్దులు మార్పు కోసం ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి ఈనెల 29న రాష్ట్ర మంత్రుల బృందం విజ్ఞప్తులను స్వీకరిస్తారని నంద్యాల కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు.
News August 24, 2025
సైక్లింగ్తో సంపూర్ణ ఆరోగ్యం: కడప SP

ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే సైక్లింగ్ అలవాటు చేసుకోవాలని కడప ఎస్పీ అశోక్ కుమార్ సూచించారు. ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఊటుకూరు సర్కిల్ నుంచి మౌంట్ ఫోర్ట్ స్కూల్ వరకు ఆదివారం సైక్లింగ్ నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. సైక్లింగ్ సహజ సిద్ధమైన వ్యాయామని చెప్పారు. అందరూ వ్యాయామంతో పాటు సైక్లింగ్ కూడా అలవాటు చేసుకోవాలని కోరారు.
News August 24, 2025
సీఎం రేవంత్కు KTR సవాల్

TG: CM రేవంత్ రెడ్డికి BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR సవాల్ విసిరారు. ‘పార్టీ మారిన MLAలు దమ్ముంటే రాజీనామా చేసి గెలవాలి. 20 నెలల పాలన చూపించి ఉపఎన్నికలకు వెళ్లే దమ్ము CMకు ఉందా? సుప్రీంకోర్టు తీర్పుతో పార్టీ మారిన MLAలకు భయం పట్టుకుంది. హైడ్రా పేరుతో హైదరాబాద్ అభివృద్ధిని అతలాకుతలం చేశారు. దుర్గంచెరువు FTLలో ఉన్న రేవంత్ అన్న తిరుపతిరెడ్డి ఇంటిని కూల్చే దమ్ము హైడ్రాకు ఉందా?’ అని ప్రశ్నించారు.