News February 21, 2025

BREAKING: ఖమ్మం: శ్రీ చైతన్య కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్య

image

ఖమ్మంలోని ఇల్లందు క్రాస్ రోడ్‌లో గల శ్రీచైతన్య జూనియర్ కాలేజీ క్యాంపస్‌లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని డేగల యోగనందిని (17) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని స్థానికులు తెలిపారు. ఉదయం స్టడీ అవర్‌కు హాజరైన ఆమె హాస్టల్‌కు వెళ్లి ఆత్మహత్యకు పాల్పడిందని చెప్పారు. మృతురాలు ఏపీ అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక వాసి సత్యరాజ్ కుమార్తెగా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు దర్యాప్తు చేపట్టామన్నారు.  

Similar News

News February 28, 2026

రేపు ఖమ్మంకు నేషనల్ ఎస్టీ కమిషన్ సభ్యుడి రాక

image

నేషనల్ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ ఆదివారం ఖమ్మంలో పర్యటించనున్నట్లు జిల్లా బీజేపీ నాయకుడు జాటోత్ మధునాయక్ తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా సా.3 గంటలకు ఎస్టీ కమిషన్ సభ్యుడు వెలుగుమట్ల భూదాన్ భూముల బాధితులను పరామర్శిస్తారని చెప్పారు. అనంతరం భూదాన్ భూముల్లో కూల్చివేసిన ఇళ్లను పరిశీలిస్తారని అన్నారు. ఈ విషయాన్ని అధికారులు, ప్రజలు గమనించాలని పేర్కొన్నారు.

News February 28, 2026

ఖమ్మం: ముఖ్యమంత్రి గారూ మీ హృదయం ఎందుకు కరగదు?

image

ఖమ్మం భూదాన్ ఘటనలో ఓ ఎస్‌ఐ కూడా బాధితుల పరిస్థితి చూసి కంటతడి పెట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోందని MLC తీన్మార్ మల్లన్న గుర్తు చేశారు. పోలీసులే కరిగిపోయారు, మరి ముఖ్యమంత్రి గారూ మీ హృదయం ఎందుకు కరగదు? అని ప్రశ్నించారు. బీసీలపై వివక్ష కొనసాగితే తెలంగాణ రాజ్యాధికార పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. ‘రేపు అసెంబ్లీలో ఇదే అంశంపై గళమెత్తుతాను. ఎవరు అడ్డుకుంటారో చూస్తాను’ అంటూ సవాల్ విసిరారు.

News February 28, 2026

ఖమ్మం: బీసీ భూముల మీద కక్ష సాధింపు ఎందుకు: తీన్మార్ మల్లన్న

image

రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్‌నగర్‌, ఖమ్మం జిల్లాల్లో మొత్తం 65 వేల ఎకరాల భూదాన్ భూములు అగ్రవర్ణాల ఖబ్జాలో ఉన్నప్పుడు, పేద బీసీ కుటుంబాల 62 ఎకరాల భూముల మీద కక్ష సాధింపు చర్యలు ఎందుకని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం భూదాన్ భూముల్లో ఇళ్లు కోల్పోయిన బాధితులతో ముఖాముఖిగా సమావేశమైన మల్లన్న ప్రభుత్వంపై అగ్గి రవ్వలు రువ్వారు.