News April 14, 2025

BREAKING: గద్వాల: యాక్సిడెంట్.. ఇద్దరు మృతి

image

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మరణించిన ఘటన గద్వాల జిల్లా మానవపాడు మండలం జల్లాపురం గ్రామ శివారులోని ఆర్టీఏ చెక్‌పోస్ట్ వద్ద సోమవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. నాందేడ్ నుంచి పసుపు లోడ్‌తో కేరళకు వెళ్తున్న లారీ హైవే పక్కన ఆగింది. ఈ సమయంలో షాద్‌నగర్ నుంచి ఆళ్లగడ్డ వెళ్తున్న లారీ అతివేగంగా వచ్చి ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ప్రమాదంలో లారీ డ్రైవర్ షేక్ హుస్సేన్, క్లీనర్ వీరయ్య మృతిచెందారు.

Similar News

News November 11, 2025

సిద్దిపేట: అందని రాయితీ.. ఎదురుచూపులే గతి!

image

సిద్దిపేట జిల్లాలో వంట గ్యాస్ వినియోగదారులు రూ.500 రాయితీ డబ్బుల కోసం ఎనిమిది నెలలుగా ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఆరు గ్యారెంటీల్లో మహాలక్ష్మి పథకంలో భాగంగా రూ.500కే గ్యాస్‌ను అమలు చేస్తుంది. అయితే పథకం ప్రారంభంలో ఖాతాలో రాయితీ డబ్బులు జమ చేసినా 8 నెలలుగా జమ కావడం లేదని పలువురు లబ్ధిదారులు పేర్కొన్నారు. జిల్లాలో 79 వేల లబ్ధిదారులున్నారు. మీకు సబ్సిడీ పడిందా కామెంట్.

News November 11, 2025

సిద్దిపేట: ‘అందెశ్రీ’ అసలు పేరు వెనుక ఉన్న రహస్యం..!

image

సహజ కవి అందెశ్రీకి చదువుకునే అవకాశం రాలేదు. ప్రకృతి ఒడిలోనే పైరగాలిలో, మట్టివాసనల్లో ఆయన మనసు కవిత్వం అల్లింది. అందెశ్రీ అసలు పేరు ఎల్లయ్య. తాపీ పని నేర్చుకోవడానికి నిజామాబాద్ వెళ్లినప్పుడు శృంగేరి మఠానికి చెందిన స్వామీ శంకర్ మహారాజ్ ఆయన పాటలు విన్నారు. ఆశువుగా అద్భుతమైన కవిత్వం చెప్పే ఆయన ప్రతిభను గుర్తించి, చేరదీసి ఆయన పేరును అందెశ్రీగా మార్చారు. అప్పటి నుంచే ఆయన జీవితం ఒక కొత్త మలుపు తిరిగింది.

News November 11, 2025

నేడు చేనేతపురిలో టెక్స్‌టైల్ పార్కుకు శంకుస్థాపన

image

వేటపాలెం మండలం చెల్లారెడ్డిపాలెం పంచాయతీ పరిధిలోని చేనేతపురిలో మంగళవారం టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటుకు భూమి పూజ చేయనున్నారు. చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య తన కార్యాలయంలో సోమవారం నాయకులతో సమీక్షించారు. చేనేతల అభివృద్ధికి ఇది ఒక చారిత్రాత్మక అడుగు అని అన్నారు. నియోజకవర్గం అభివృద్ధికి తాను కృషి చేస్తున్నానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలు, నాయకులు పాల్గొనాలని కోరారు.